Rishab Shetty : తమిళనాడు కరూర్ ర్యాలీ ఘటనపై స్పందించిన రిషబ్ శెట్టి
- Follow Us :
-
-
Add as a preferred
source on google
‘కాంతారా చాప్టర్ 1’తో సూపర్ సక్సెస్ అందుకున్న రిషబ్ శెట్టి ప్రస్తుతం ఫుల్ జోష్లో ఉన్నారు. అయితే తాజాగా ఆయన తమిళనాడులో జరిగిన విషాద ఘటనపై స్పందించారు. ఇటీవల కరూర్లో నటుడు, రాజకీయ నాయకుడు విజయ్ నిర్వహించిన ర్యాలీలో తొక్కిసలాట జరిగి 41 మంది ప్రాణాలు కోల్పోయిన సంగతి తెలిసిందే. ఈ ఘటనపై స్పందించిన రిషబ్ శెట్టి, ఇది ఒక్కరి తప్పు కాదని, “సమష్టి తప్పిదం” అని పేర్కొన్నారు.
Also Read : Kanthara : దయచేసి ఇలా మాత్రం కాంతార థియేటర్లకి రాకండి – రిషబ్ శెట్టి విజ్ఞప్తి
Also Read
- Tollywood Comeback: స్టార్ హీరోల ‘సాలిడ్ కంబ్యాక్’: రికార్డుల మోత మోగిస్తున్న 2026 టాలీవుడ్!
- Shavukaru Janaki : వెండితెర 'షావుకారు' జానకి ఇకలేరు.. ఏడు పదుల సినీ ప్రస్థానానికి ముగింపు
- Arjun Reedy Ice Scene: 'ఐస్ వేసుకునే సీన్' రాగానే నిర్మాతలు ఆపెయ్యమనేవాళ్లు..!
- Spirit: 'స్పిరిట్'లో చిరంజీవి, డాన్ లీ ఉన్నారా..?
తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో రిషబ్ మాట్లాడుతూ.. “మన దేశంలో హీరో అభిమానులు తమ అభిమాన నటుడిని దేవుడిలా చూసుకుంటారు. కానీ ఇలాంటి పరిస్థితుల్లో సమయోచిత జాగ్రత్తలు తీసుకోకపోతే విషాదాలు జరుగుతాయి. ఇది ఒక వ్యక్తి చేసిన తప్పు కాదు, పెద్ద ఎత్తున జరిగే సమావేశాలను నియంత్రించడం కష్టం. మనం పోలీసులను లేదా ప్రభుత్వాన్ని సులభంగా నిందించవచ్చు. వారికి బాధ్యత ఉంది. కానీ కొన్నిసార్లు వారు గుంపును నియంత్రించడంలో ఇబ్బందులు ఎదుర్కొంటారు. అయినప్పటికీ భవిష్యత్తులో ఇలాంటి విషాదాలు జరగకుండా జాగ్రత్తలు తీసుకోవాలి. ఇలాంటి ఘటనలు నిజంగా దురదృష్టకరం” అని అన్నారు.
ఇక ఈ ఘటనలో 41 మంది మరణించగా, 60 మందికి పైగా గాయపడ్డారు. వేదికకు 10,000 మంది మాత్రమే అనుమతించాల్సి ఉండగా దాదాపు 30,000 మంది చేరుకోవడం వల్ల తొక్కిసలాట జరిగిందని అధికారులు తెలిపారు. బాధిత కుటుంబాలకు విజయ్ ఒక్కో కుటుంబానికి రూ.20 లక్షల పరిహారం ప్రకటించగా, గాయపడిన వారికి రూ.2 లక్షలు అందజేశారు.
తాజావార్తలు
-
Story Board : చట్టబద్ధ పాలన కోసం జరిగిన ఏర్పాట్లేంటి..? రాజ్యాంగం కోర్టులకు ఇచ్చిన అధికారాలేంటి..?
-
CM Revanth Reddy : ఆక్స్ఫర్డ్కు రేవంత్ ఆహ్వానం.. హైదరాబాద్లో కొత్త క్యాంపస్.?
-
Minister Narayana: మున్సిపల్ ఎన్నికలపై మంత్రి నారాయణ కీలక వ్యాఖ్యలు.. ఆ తర్వాతే ప్రక్రియ
-
YS Jagan: స్థానిక ఎన్నికలపై వైసీపీ ఫోకస్.. 25న జగన్ కీలక భేటీ
-
OTR: రాజమండ్రి కార్పొరేషన్ ఎన్నికలు మళ్లీ వాయిదా.. కోర్టు కేసులా? పొలిటికల్ గేమా?
ట్రెండింగ్
-
18 రోజుల బ్యాటరీ, 140+ స్పోర్ట్స్ మోడ్స్, AMOLED డిస్ప్లేతో Redmi Watch 6 Active లాంచ్..!
-
Kitchen Hacks: చాకు పదును పోయిందా? కొత్తది కొనాల్సిన పనిలేదు.. ఈ సింపుల్ ట్రిక్స్తో ఇంట్లోనే పదును పెట్టండి..!
-
Blood Donation: రక్తదానం ఎవరు చేయొచ్చు? ఎవరు చేయకూడదు? ఒకవేళ రక్తదానం చేస్తే ఏమైనా సమస్యలు ఎదురవుతాయా.?
-
IND vs SL 2nd Test: రెండో టెస్ట్ నుంచి కుల్దీప్ యాదవ్ ఔట్.. 33 ఏళ్ల దేశవాళీ కింగ్కు ఛాన్స్?
-
16:9.5 యాస్పెక్ట్ రేషియో వైడ్ స్క్రీన్తో ప్రపంచంలోనే తొలి క్యాండీబార్ ఫోన్ Huawei Pura X View..!