Ram Gopal Varma Vyuham- Sapatham New Release Dates Announced: రామ్ గోపాల్ వర్మ ప్రతిష్టాత్మకంగా తెరకెక్కించిన ‘వ్యూహం’ సినిమాకి ఏర్పడిన సెన్సార్ ఇబ్బందులు తొలిగాయి. అజ్మల్, మానస ప్రధాన పాత్రల్లో ప్రముఖ నిర్మాత దాసరి కిరణ్ కుమార్ ఈ నిర్మించిన ఈ మూవీ రిలీజ్ చేయకుండా చూడాలని టీడీపీ జాతీయ కార్యదర్శి నారా లోకేష్ సెన్సార్ బోర్డుకు లేఖ రాసిన సంగతి తెలిసిందే. ఆ తర్వాత ఇదే విషయం మీద కోర్టుకు వెళ్లగా అనేక వాదనలు, తీర్పులు అనంతరం వ్యూహం సినిమాకి అన్ని అడ్డంకులు తొలిగాయి. ఈ నేపథ్యంలో సినిమాని ఫిబ్రవరి 16వ తేదీ రిలీజ్ చేస్తారని రామ్ గోపాల్ వర్మ ముందే ప్రకటించారు. అయితే ఇప్పుడు సినిమా రిలీజ్ డేట్ మారుస్తున్నట్లు ఒక పోస్టర్ రిలీజ్ చేశారు. ఫిబ్రవరి 23వ తేదీన వ్యూహం సినిమా రిలీజ్ చేస్తున్నట్లు వర్మ పేర్కొన్నారు.
Isha Ambani : టుట్టి ఫ్రూటీ, పాన్ పసంద్ అమ్మే కంపెనీని కొనుగోలు చేయనున్న ఇషా అంబానీ
అదే విధంగా వారం రోజుల తర్వాత అంటే మార్చి ఒకటో తేదీన శపథం సినిమాని రిలీజ్ చేస్తున్నట్లు ఆయన పేర్కొన్నారు. వైఎస్ రాజశేఖర్ రెడ్డి మరణానంతరం ఏపీ సీఎం జగన్ మోహన్ రెడ్డి జీవితంలో జరిగిన అంశాల ఆధారంగా చేసుకుని తెరకెక్కించారు. ఈ సినిమా ఎప్పుడో నవంబర్ నెలలో రిలీజ్ కావాల్సి ఉంది కానీ సెన్సార్ సర్టిఫికెట్ ఇచ్చేందుకు అప్పట్లో సెన్సార్ బోర్డు నిరాకరించింది. సినిమాలోని పాత్రలకు నిజ జీవితంలోని నేతల పేర్లు పెట్టడంపై అభ్యంతరం వ్యక్తం చేసింది, ‘వ్యూహం’ చిత్రానికి సెన్సార్ సర్టిఫికెట్ ఇవ్వలేమని తేల్చి చెప్పింది. ‘వ్యూహం’ సినిమాతో పాటు పార్ట్-2ని ‘శపథం’ పేరుతో వర్మ రిలీజ్ చేయబోతున్నారు. ‘వ్యూహం’ సినిమాని నవంబర్ 10న, ‘శపథం’ మూవీని జనవరి 25న ప్రేక్షకులముందుకు తీసుకురావడానికి ముందు ప్లాన్ చేశారు. అయితే ఇప్పుడు ఫిబ్రవరి 23వ తేదీన వ్యూహం, మార్చి ఒకటో తేదీన శపథం సినిమాని రిలీజ్ చేస్తున్నారు.