మెగా పవర్స్టార్ రామ్చరణ్ కథానాయకుడిగా, బుచ్చిబాబు సన దర్శకత్వంలో తెరకెక్కుతున్న భారీ పాన్-ఇండియా స్పోర్ట్స్ డ్రామా ‘పెద్ది’. వచ్చే వారం జూన్ 4న ఈ చిత్రం ప్రపంచవ్యాప్తంగా గ్రాండ్గా విడుదల కాబోతున్న నేపథ్యంలో ప్రమోషన్స్ ఊపందుకున్నాయి. అయితే సినిమాపై సోషల్ మీడియా వేదికగా కొందరు పనిగట్టుకుని నెగిటివిటీని ప్రచారం చేస్తుండటంతో ‘పెద్ది’ చిత్ర బృందం తీవ్రంగా పరిగణించింది. ఆన్లైన్ టార్గెటెడ్ నెగిటివిటీ, పెయిడ్ ట్రోలింగ్కు అడ్డుకట్ట వేసేందుకు మేకర్స్ రంగంలోకి దిగి లీగల్ యాక్షన్ ప్రారంభించారు.
ఇన్స్టాగ్రామ్, ఎక్స్ వేదికలుగా మల్టిపుల్ ఫేక్ అకౌంట్స్ క్రియేట్ చేసి.. హీరో రామ్చరణ్తో పాటు ‘పెద్ది’ సినిమాను టార్గెట్ చేస్తూ కావాలనే నెగిటివ్ ప్రచారం చేస్తున్నారనే ఆరోపణలపై చిత్ర యూనిట్ సైబర్ క్రైమ్ పోలీసులను ఆశ్రయించింది. ఈ విచారణలో భాగంగా గుంటూరుకు చెందిన ఓ నెటిజన్, హైదరాబాద్ కూకట్పల్లికి చెందిన మరొక నెటిజన్ పై సైబర్ క్రైమ్ పోలీస్ స్టేషన్లలో FIRలు నమోదయ్యాయి. కేవలం కొందరు వ్యక్తులే కాకుండా భారీగా డబ్బులు చేతులు మార్చి, ఒక పద్దతి ప్రకారం ఆన్లైన్ నెగిటివిటీని నడిపిస్తున్న కొన్ని పెద్ద గ్రూప్స్ వెనుక ఉన్న అసలు సూత్రధారుల వివరాలను కూడా పోలీసులు సేకరిస్తున్నారు. ఈ పెయిడ్ ట్రోలింగ్ నెట్వర్క్లో పనిచేస్తున్న టీమ్స్, వాటి వెనుక ఉన్న పెద్ద తలకాయల వివరాలు త్వరలోనే అధికారికంగా బయటకు రానున్నాయని ఇండస్ట్రీ వర్గాలు చెబుతున్నాయి. సినిమా ఇండస్ట్రీలో ఇటువంటి అక్రమ నెగిటివ్ ట్రెండ్స్పై లీగల్ షీల్డ్ ఉపయోగించడం పట్ల టాలీవుడ్ సర్కిల్స్ లో హర్షాతిరేకాలు వ్యక్తమవుతున్నాయి.
