ఐకాన్ స్టార్ అల్లు అర్జున్ నటించిన “పుష్ప: ది రైజ్” ట్రైలర్ కోసం అభిమానులు ఎంతో ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు. అల్లు అర్జున్, సుకుమార్ కాంబినేషన్ లో చిత్తూరు జిల్లాలో సాగుతున్న ఎర్రచందనం స్మగ్లింగ్ మాఫియా ఆధారంగా “పుష్ప” తెరకెక్కుతోంది. రష్మిక మందన్న కథానాయికగా నటిస్తుండగా సమంత ప్రత్యేక గీతంలో కనిపించనుంది. మలయాళ స్టార్ హీరో ఫహద్ ఫాసిల్, సునీల్ విలన్లుగా, అనసూయ ప్రత్యేక పాత్రలో నటిస్తున్నారు. మైత్రీ మూవీ మేకర్స్, ముత్తంశెట్టి మీడియా బ్యానర్లు సంయుక్తంగా ఈ భారీ బడ్జెట్ 2 భాగాల యాక్షన్ డ్రామాను నిర్మిస్తున్నాయి. ఈ పాన్ ఇండియా చిత్రం డిసెంబర్ 17న విడుదల కానుంది. డిసెంబర్ 1వ వారంలో ట్రైలర్ విడుదల అవుతుందని వార్తలు రాగా, మేకర్స్ పుకార్లపై స్పందిస్తూ, ట్రైలర్ పని ప్రోగ్రెస్ లో ఉందని, సాలిడ్ పోస్టర్ తో ట్రైలర్ గురించిన అప్డేట్ ఇస్తామని ప్రకటించారు.
Read Also : టైం ట్రావెల్ ఫ్రమ్ ఈవిల్ టు గుడ్… “బింబిసార” టీజర్
తాజాగా ‘పుష్ప’ మేకర్స్ ట్రైలర్ విడుదల తేదీని ఖరారు చేస్తూ అఫిషియల్ అనౌన్స్మెంట్ ఇచ్చారు. ప్రత్యేక పోస్టర్ తో ‘పుష్ప’ ట్రైలర్ అప్డేట్ ను అనౌన్స్ చేశారు. ఆ పోస్టర్ లో అల్లు అర్జున్ ‘తగ్గేదే లే’ అన్నట్లుగా కన్పించగా, డిసెంబర్ 6న ట్రైలర్ విడుదల కానుందని స్పష్టం చేశారు. డిసెంబర్ 6 నుంచి వైల్డెస్ట్ మాస్ ఫెస్టివల్ ప్రారంభం కానుంది. దీంతో బన్నీ అభిమానులు ‘తగ్గేదే లే’ అంటూ సోషల్ మీడియాలో #అల్లుఅర్జున్, #పుష్ప ది రైజ్ ట్రైలర్ అనే హ్యాష్ ట్యాగ్ లను ట్రెండ్ చేస్తున్నారు.
