Site icon NTV Telugu

ప్రభాస్ సినిమాపై నిర్మాత కీలక ప్రకటన

యంగ్ రెబల్ స్టార్ ప్రభాస్ చేతిలో భారీ ప్రాజెక్ట్ సినిమాలు ఉన్న సంగతి తెలిసిందే.. ఆయన సినిమాల అప్డేట్స్ కోసం ఫ్యాన్స్ చాలా వెయిట్ చేస్తున్నారు. రాధే శ్యామ్ సంక్రాంతికి వస్తుండగా.. సలార్, ఆదిపురుష్ సినిమాలు షూటింగ్ దశలో వున్నాయి. ఇక ఈ సినిమాల తర్వాత ప్రభాస్, నాగ్ అశ్విన్ తో సినిమా చేయనున్నారు. విభిన్నమైన సైన్స్‌ ఫిక్షన్‌ స్టోరీతో సోషియో ఫాంటసీగా ఈ సినిమా రానుంది. వైజయంతీ మూవీస్‌ పతాకంపై అశ్వినీ దత్‌ నిర్మిస్తున్నారు. అయితే తాజాగా నిర్మాత అశ్వినీ దత్‌ ఈ చిత్రముచ్చట్లను చెప్పుకొచ్చారు.

‘నవంబరు నుంచి రెగ్యులర్‌ చిత్రీకరణ ప్రారంభమవుతుంది. అప్పటినుంచి దాదాపు 13 నెలల పాటు రెగ్యులర్ షూటింగ్ జరుపుకొంటుంది. గ్రాఫిక్స్‌ పనులు కూడా ప్రారంభమయ్యాయి. అయితే ఇప్పటికే అమితాబ్‌ బచ్చన్‌పై కొన్ని కీలక సన్నివేశాలు తెరకెక్కినట్లు’ అశ్వినీదత్‌ తెలిపారు. ఇక ప్రభాస్ సరసన దీపికా పదుకొణె నటించనున్న విషయం తెలిసిందే.

Exit mobile version