NTV Telugu Site icon

Prithviraj Sukumaran: సలార్ కోసం.. వరద మొట్టమొదటిసారి ఆ పనిచేశాడంట..

Ps

Ps

Prithviraj Sukumaran: మలయాళ స్టార్ హీరో పృథ్వీరాజ్ సుకుమారన్ గురించి తెలుగువారికి పరిచయం చేయాల్సిన అవసరమే లేదు. తెలుగులో డైరెక్ట్ గా సినిమాలు చేయకపోయినా కూడా.. డబ్బింగ్ సినిమాలతో తెలుగువారికి దగ్గరయ్యాడు. హీరోగానే కాకుండా డైరెక్టర్ గా, నిర్మాతగా ఎన్నో మంచి సినిమాలను ప్రేక్షకులకు అందించాడు. ఇక సలార్ సినిమాతో పాన్ ఇండియా లెవెల్లో విలన్ గా ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. ప్రభాస్ హీరోగా ప్రశాంత్ నీల్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న చిత్రం సలార్. శృతి హాసన్ హీరోయిన్ గా నటిస్తున్న ఈ చిత్రంలో పృథ్వీరాజ్ సుకుమారన్ కీలక పాత్రలో నటిస్తున్నాడు. ఇప్పటికే ఈ చిత్రం నుంచి రిలీజైన ట్రైలర్ ప్రేక్షకులను విశేషంగా ఆకట్టుకున్నాయి. దేవా అనే పాత్రలో ప్రభాస్ నటిస్తుండగా.. వరద రాజమన్నన్ పాత్రలో పృథ్వీరాజ్ సుకుమారన్ నటిస్తున్నాడు. ఇద్దరు స్నేహితులు.. ఎలా బద్ద శత్రువులుగా మారారు అనేది సలార్ కథగా తెలుస్తోంది. ఇకపోతే ఈ సినిమా రెండు పార్ట్స్ గా రానుంది. ఇప్పటికే ఈ సినిమాపై అభిమానులు భారీ అంచనాలను పెట్టుకున్నారు.

ఇక ఈ సినిమాకు సంబంధించిన లేటెస్ట్ అప్డేట్ ను పృథ్వీరాజ్ సుకుమారన్ ట్విట్టర్ ద్వారా పంచుకున్నాడు. సలార్ కు డబ్బింగ్ చెప్పడం పూర్తి అయ్యిందని చెప్పుకొచ్చాడు. అంతేకాకుండా మొట్టమొదటి సారి ఐదు భాషల్లో తానే స్వయంగా తన పాత్రకు డబ్బింగ్ చెప్పినట్లు తెలిపాడు. ” సలార్ .. ఫైనల్ డబ్బింగ్ కరెక్షన్స్ పూర్తయ్యాయి. నేను సంవత్సరాల తరబడి పనిచేసిన వివిధ భాషల్లోని నా పాత్రలన్నింటికీ నా స్వంత గాత్రాన్ని అందించే అదృష్టం నాకు దక్కింది. నా పాత్రలకు పలు భాషల్లో డబ్బింగ్ కూడా చెప్పాను. అయితే ఒకే క్యారెక్టర్‌కి ఒకే సినిమాలో 5 భాషల్లో డబ్బింగ్ చెప్పడం నాకు ఇదే మొదటిసారి. తెలుగు, కన్నడ, తమిళం, హిందీ మరియు మలయాళం లో సలార్ కోసం నేను డబ్బింగ్ చెప్పాను. డిసెంబర్ 22, 2023న ప్రపంచవ్యాప్తంగా ఉన్న థియేటర్లలో దేవా మరియు వరద మిమ్మల్ని కలుస్తారు” అంటూ రాసుకొచ్చాడు. ప్రస్తుతం ఈ ట్వీట్ నెట్టింట వైరల్ గా మారింది. మరి ఈ సినిమాతో ఈ ఇద్దరు స్టార్ హీరోలు ఎలాంటి విజయాన్ని అందుకుంటారో చూడాలి.