2015లో మలయాళ ఇండస్ట్రీనే ఊపేసింది ప్రేమమ్. నివిన్ పౌలీ హీరోగా ఆల్పాన్స్ ఫుత్రేన్ దర్శకత్వంలో వచ్చిన ఈ మూవీ కల్ట్ క్లాసిక్ చిత్రాల్లో ఒకటిగా నిలిచిపోయింది. ఈసినిమాతోనే సాయి పల్లవి వెండితెరకు పరిచయమయింది. ప్రేమమ్ ను నాలుగు కోట్లతో తీస్తే రూ. 75 కోట్లను వసూలు చేసి ఆశ్చర్యపరచింది. అక్కడ బాక్సాఫీసుపై ఇంపాక్టే కాదు ట్రయాంగిల్ లవ్ స్టోరీలకు కొత్త అర్థం చెప్పింది మూవీ. నివిన్ పౌలీని కెరీరే తిప్పేసిన సినిమా ప్రేమమ్.
సర్వం మాయ రానంత వరకు అతడి కెరీర్లోనే హయ్యెస్ట్ గ్రాసర్ చిత్రంగా నిలిచింది . ఇప్పుడు స్టార్ హీరోయిన్లుగా కొనసాగుతున్న సాయి పల్లవి, అనుపమ పరమేశ్వరన్లకు లైఫ్ ఇచ్చింది కూడా ఈ మూవీనే. ఈ సినిమాకు సాయి పల్లవి కొరియోగ్రాఫీ చేయడం విశేషం. తెలుగు ఆడియెన్స్ ప్రేమమ్ నుండే మలయాళ సినిమాలను రెగ్యులర్ గా ఫాలో అవడం మొదలెట్టారని చెప్పడంలో కూడా సందేహం లేదు. ఇంతటి సంచలనాలు సృష్టించిన ప్రేమమ్ రిలీజై 11 ఇయర్స్ కంప్లీట్ కావొస్తున్నాయి. ప్రేమమ్ తర్వాత నివిన్ పౌలీ ఎన్నో సినిమాలు చేసి స్టార్ హీరోగా ఎదిగాడు. కానీ డైరెక్టర్ వన్ ఆర్ టూ మూవీస్కే పరిమితయ్యాడు. దర్శకుడిగా ట్రాక్ తప్పేసిన ఆల్ఫాన్సోను తిరిగి ఫేమ్ తెచ్చేందుకు మరో ఛాన్స్ ఇస్తున్నాడు నివిన్ పౌలీ. తన మైల్ స్టోన్ మూవీ 50వ ప్రాజెక్ట్కు ఆల్ఫోన్సోను సెట్ చేశాడు హీరో. జూన్ 27న టైటిల్ రివీల్ చేయనున్నారు. స్పోర్ట్స్ డ్రామాగా తెరకెక్కుతున్నట్లు సమాచారం. మరీ ఈ కాంబో సర్వం మాయ రికార్డ్స్ చెరిపేస్తుందో లేదో చూడాలి.

