NTV Telugu Site icon

Pindam : ఓటీటీలోకి వచ్చేస్తున్న లేటెస్ట్ హారర్ మూవీ.. స్ట్రీమింగ్ ఎప్పుడంటే..?

Whatsapp Image 2023 12 30 At 4.24.02 Pm

Whatsapp Image 2023 12 30 At 4.24.02 Pm

తెలుగులో రిలీజ్ అయిన లేటెస్ట్ హారర్ చిత్రం ‘పిండం’. ‘ది స్కేరియస్ట్ ఫిల్మ్’ అనేది ఉప శీర్షిక.అంటే చాలా భయపెట్టే సినిమా అని అర్ధం. ఈ సినిమాలో తమిళ హీరో శ్రీరామ్ మరియు ఖుషీ రవి జంటగా నటించారు.ఈ సినిమాకు సాయికిరణ్ దైదా దర్శకత్వం వహించారు. సలార్ ఫేమ్ ఈశ్వరి రావు మరియు అవసరాల శ్రీనివాస్ ముఖ్య పాత్రలు పోషించారు.కళాహి మీడియా బ్యానర్‌పై యశ్వంత్ దగ్గుమాటి పిండం చిత్రాన్ని నిర్మించారు. పిండం మూవీ డిసెంబర్ 15వ తేదీన ప్రపంచవ్యాప్తంగా ఎంతో గ్రాండ్ గా విడుదల అయి బాక్సాఫీస్ వద్ద పర్వాలేదనిపించుకుంది.ఈ సినిమాకు మొదట మిక్స్‌డ్ టాక్‌తో రివ్యూలు వచ్చాయి. కానీ ప్రేక్షకులు మాత్రం ఈ సినిమాను బాగానే ఆదరించారు.పిండం మూవీ మేకర్స్ ట్రైలర్‌తో మూవీపై అంచనాలు పెంచేసారు..అయితే ఆ అంచనాలకు తగినట్లుగా సినిమా లేదని కొంతమంది అభిప్రాయపడ్డారు.ఇదిలా ఉంటే ఈ హారర్ మూవీ పిండం ఇప్పుడు ఓటీటీ స్ట్రీమింగ్‌కు రానుంది.

పిండం మూవీ డిజిటల్ హక్కులను ప్రముఖ ఓటీటీ దిగ్గజం నెట్‌ఫ్లిక్స్ సొంతం చేసుకుందని సమాచారం. పిండం మూవీనీ న్యూ ఇయర్ కానుకగా వచ్చే ఏడాది అంటే 2024 జనవరి మొదటి వారంలోనే నెట్‌ఫ్లిక్స్‌లో రిలీజ్ చేయనున్నారని తెలుస్తోంది.పిండం ఓటీటీ స్ట్రీమింగ్ చేసేందుకు దాదాపు కన్ఫర్మ్ అయినట్లు తెలుస్తుంది., అందుకు తగిన డీల్, ఏర్పాట్లు జరిగినట్లు సమాచారం. పిండం’ మూవీ కథ విషయానికి వస్తే, ఆంథోని(శ్రీరామ్) ఓ రైస్ మిల్లులో అకౌంటెంట్ గా పని చేస్తాడు. అతడి భార్య మేరి(ఖుషి రవి), ఇద్దరు కూతుళ్లు(సోఫియా, తార), తల్లి సూరమ్మతో కలిసి ఓ ఇంట్లో ఉంటారు. అది చాలా పురాతమైన ఇల్లు. తక్కువ ధరకు వస్తుందని భావించి వారు కొనుగోలు చేస్తారు.. ఆ ఇంట్లోకి వచ్చిన తర్వాత వారికి ఊహించని సంఘటనలు ఎదురు అవుతాయి. వాటిని ఎలా ఎదుర్కొన్నారు అనేది కథాశంతో ఈ మూవీ రూపొందింది. పిండం మూవీని ప్రస్తుత కాలంతోపాటు 1990 మరియు 1930 లలో ఇలా మూడు కాలక్రమాలలో జరిగిన కథగా తెరకెక్కించారు. అయితే థియేటర్స్ లో పర్వాలేదనిపించిన పిండం మూవీ ఓటీటీ ప్రేక్షకులను ఏవిధంగా ఆకట్టుకుంటుందో చూడాలి.