రామ్ చరణ్ హీరోగా బుచ్చి బాబు డైరెక్షన్లో వాస్తున్న ‘పెద్ది’ సినిమా విడుదల గురించి ఇండస్ట్రీ వర్గాల్లో ఒక ఆసక్తికరమైన చర్చ నడుస్తోంది. ముందుగా అనుకున్నట్లుగా ఈ చిత్రం ఏప్రిల్ 30న థియేటర్లలోకి రావడం లేదని అధికారికంగా ఇంకా అనౌన్స్ చేయలేదు కానీ ఈ వాయిదా వెనుక కేవలం డేట్ మార్పు మాత్రమే కాదు, పెద్ద ఎత్తున ఓటీటీ బేరసారాలు కూడా ఉన్నట్లు సమాచారం. ఇప్పటికే ఓ సారి వాయిదా వేసిన నిర్మాతలు మరోమారు సినిమాను వాయిదా వేయాలని ఒక నిర్ణయానికి వచ్చేశారు. ప్రస్తుతం వారి పూర్తి ఫోకస్ ప్రముఖ ఓటీటీ సంస్థతో జరుగుతున్న చర్చల పైన ఉంది. ఏప్రిల్ 30 దాటిన తర్వాత, మే నెలలో ఏ తేదీన సినిమాను విడుదల చేస్తే బాగుంటుందనే విషయంపై ఓటీటీ పార్ట్నర్లతో సంప్రదింపులు జరుపుతున్నారు. స్ట్రీమింగ్ నిబంధనలు, థియేట్రికల్ రిలీజ్ మధ్య గ్యాప్ వంటి అంశాలే ఈ చర్చలకు ప్రధాన కారణం.
Also Read :NTR Dragon: తారక్ ‘డ్రాగన్’ అవతారం.. 3000 ఏళ్ల నాటి యుద్ధ విద్యలో ఎన్టీఆర్ కఠిన శిక్షణ!
షెడ్యూల్ ప్రకారం ఏప్రిల్ 30న సినిమా రాకపోవడం వల్ల, మునుపటి ఒప్పందం ప్రకారం ఓటీటీ సంస్థ కొంత మేర చెల్లింపుల్లో కోత విధించే అవకాశం ఉందని, దీనివల్ల నిర్మాతలకు ఆర్థికంగా కొంత నష్టం వాటిల్లే ప్రమాదం ఉంది అనే చర్చ ఉంది. అయితే, ఈ కోత ఎంత మేర ఉంటుంది అనేది ప్రస్తుతానికి సదరు ఓటీటీ సంస్థకు మరియు నిర్మాతలకు మాత్రమే తెలిసిన రహస్యం. అయితే, ఈ డీల్లో ఒక ఆసక్తికరమైన మెలిక కూడా ఉందంటున్నారు. అదేమంటే ఒకవేళ సినిమా లేటుగా విడుదలైనా, బాక్సాఫీస్ వద్ద అద్భుతమైన వసూళ్లు సాధించి, అనుకున్న టార్గెట్ నంబర్స్ను దాటితే.. ఓటీటీ సంస్థ అదనంగా మరికొంత మొత్తాన్ని చెల్లించడానికి సిద్ధంగా ఉందట. అంటే, సినిమా కంటెంట్పై నమ్మకంతో నిర్మాతలు ఈ రిస్క్ తీసుకుంటున్నట్లు కనిపిస్తోంది. మొత్తానికి ‘పెద్ది’ టీమ్ ప్రస్తుతానికి కాస్త డైలమాలో ఉన్నా, బాక్సాఫీస్ దగ్గర హిట్ కొడితే మాత్రం ఓటీటీ నుంచి వచ్చే లాభాలు ఆ నష్టాన్ని భర్తీ చేస్తాయి. త్వరలోనే కొత్త రిలీజ్ డేట్పై మేకర్స్ నుంచి అధికారిక ప్రకటన రానుంది. అప్పటివరకు వేచి చూడాల్సిందే!