సినీ అభిమానులంతా వెయ్యి కళ్లతో ఎదురుచూస్తున్న చిత్రం ఆర్ఆర్ఆర్. ఎన్టీఆర్, రామ్ చరణ్ మల్టీస్టారర్ గా రాజమౌళి దర్శకత్వం వహిస్తున్న ఈ సినిమా ఎట్టకేలకు మార్చి 25 న రిలీజ్ కి సిద్దమవుతుంది. ఇక ఈ నేపథ్యంలోనే సినిమా ప్రమోషన్స్ లో పాల్గొని రచ్చ చేస్తున్నారు ఆర్ఆర్ఆర్ బృందం. ఇక తాజా ప్రెస్ మీట్ లో ఎన్టీఆర్ తన మనసులో మాటను బయటపెట్టాడు. టాలీవుడ్ లో ఏ స్టార్ హీరోలతో మల్టీస్టారర్ చేయాలనీ ఉందో చెప్పుకొచ్చాడు.
మారుతున్న కాలాన్ని బట్టి హీరోలు సైతం మరో హీరో తో స్క్రీన్ షేర్ చేసుకుంటున్న సంగతి తెల్సిందే. ” నేను ఫ్యూచర్ లో మల్టీస్టారర్స్ చేయాల్సి వస్తే.. బాల బాబాయి, చిరంజీవి, మహేష్ బాబు, ప్రభాస్, అల్లు అర్జున్తో చేస్తాను” అని చెప్పుకొచ్చాడు. ప్రస్తుతం ఈ స్టార్ కాంబోలో ఒక సినిమా పడితే ఎలా ఉంటుందో అని ఇప్పటికే అభిమానులు ఊహించుకోవడం మొదలుపెట్టారు. మరి ఎన్టీఆర్ మనసులో మాట విన్న డైరెక్టర్లు ఈ కంబాలకు సెట్ అయ్యే కథను రెడీ చేసేసుకుంటున్నారట.