జూ. ఎన్టీఆర్ ప్రస్తుతం ఆర్ఆర్ఆర్ సినిమా ప్రమోషనలలో బిజీగా ఉన్న సంగతి తెల్సిందే. మార్చి 25 న ఈ సినిమా రిలీజ్ అవుతుండడంతో ప్రెస్ మీట్స్, ఈవెంట్స్ అంటూ ఎన్టీఆర్ అన్నింటిలోనూ చురుకుగా పాల్గొంటున్నాడు. ఇక మరోపక్క ఎన్టీఆర్ ఫ్యామిలీ తిరుమల స్వామివారిని దర్శించుకోవడం ప్రస్తుతంహాట్ టాపిక్ గా మారింది. మంగళవారం ఉదయం ఎన్టీఆర్ కుటుంబం తిరుమల స్వామివారిని దర్శించుకున్నారు. ఎన్టీఆర్ భార్య ప్రణతి, ఆయన తల్లి షాలిని తో పాటు నందమూరి నట వారసులు అభయ్ రామ్, భార్గవ్ రామ్ కూడా శ్రీవారి సేవలో పాల్గొన్నారు. దర్శనం అనంతరం ఆలయ అర్చకులు తీర్థ ప్రసాదాలు అందించారు.
ఇకపోతే ఎన్టీఆర్ ఫ్యామిలీ పబ్లిక్ లో కనిపించడం చాలా అరుదు. స్టార్ హీరోల పిల్లలు సోషల్ మీడియాలో అకౌంట్లతో హల్చల్ చేస్తున్నా.. తారక్ పిల్లలు మాత్రం కనీసం బయట ఫంక్షన్ లో కనిపించడం కూడా కష్టమే.. ఇక ఎప్పుడో ఒకసారి తారక్.. వారి పుట్టినరోజులు, పండగలకు వారి ఫోటోలను షేర్ చేస్తే తప్ప.. పబ్లిక్ ప్లేస్ లో కనిపించడం చాలా అరుదు. ఇలా తారక్ ఫ్యామిలీ మొదటిసారి పబ్లిక్ ప్లేస్ లో కనిపించడం. ఇక ఇక్కడ కూడా తారక్ పిల్లలు హాట్ టాపిక్ గా మారడం విశేషం. మరి ముఖ్యం చిన్నవాడు భార్గవ్ అచ్చుగుద్దినట్లు తండ్రి పోలికలతో ఉండడంతో అందరి కళ్లు అతగాడి మీదనే ఉన్నాయి. ఇక ఈ దర్శనంలో ఎన్టీఆర్ కూడా ఉంటే బావుండేది. తారక్ పిల్లలు ఇక్కడ .. ఆయనేమో అక్కడ అంటూ నెటిజన్స్ కామెంట్స్ చేస్తున్నారు. ప్రస్తుతం ఈ ఫోటోలు నెట్టింట వైరల్ గా మారాయి.