టాలీవుడ్ యంగ్ హీరో నిఖిల్ సిద్ధార్థ్ ఇప్పుడు టెన్షన్ లో ఉన్నారు. చివరిసారిగా 2019 ‘అర్జున్ సురవరం’లో కన్పించిన నిఖిల్ ఖాతాలో ఇప్పుడు రెండు సినిమాలు ‘కార్తికేయ 2′, ’18 పేజీలు’ అనే చిత్రాలు ఉన్నాయి. ఈ హీరో మరో రెండు ప్రాజెక్ట్లకు సంతకం చేసినట్లు వెల్లడించాడు. అయితే మహమ్మారి కారణంగా నిఖిల్ సినిమాల విడుదల తేదీలు పూర్తిగా గందరగోళంలో పడ్డాయి.
Read Also : వివాదంలో మెగా కోడలు… సోషల్ మీడియా పోస్ట్ తో చిక్కులు
మహమ్మారి కెరీర్ను ఊహించలేని స్థాయిలో ఎలా ప్రభావితం చేయడం ప్రారంభించిందో చూడటం చాలా బాధగా ఉందని నిఖిల్ సోషల్ మీడియాలో పోస్ట్ చేశాడు. “అర్జున్ సురవరం విజయం తర్వాత నేను 4 సినిమాలకు సంతకం చేశాను. 4 అద్భుతమైన స్క్రిప్ట్లపై నాకు చాలా ని భగవంతుడిని ప్రార్థిస్తున్నా” అంటూ నిఖిల్ ట్వీట్ చేశాడు. నిజానికి కోవిడ్ మహమ్మారి చాలా మంది నటీనటులకు సవాలుగా ఉంది. ఇక కొన్ని రోజుల క్రితం నిఖిల్ కూడా ఏపీ టిక్కెట్ సమస్యల గురించి, థియేటర్లు మూసివేయడం గురించి ధైర్యంగా మాట్లాడాడు. థియేటర్లను దేవాలయాలతో పోల్చిన నిఖిల్, TFIకి మద్దతు ఇచ్చినందుకు తెలంగాణ ప్రభుత్వానికి ధన్యవాదాలు తెలిపారు. తీసుకున్న నిర్ణయాల వల్ల పరిశ్రమ నష్టాలను పరిగణనలోకి తీసుకోవాలని ఆయన ఏపీ ప్రభుత్వాన్ని అభ్యర్థించారు.
Very sad to c this Pandemic affect careers on this level..
— Nikhil Siddhartha (@actor_Nikhil) January 26, 2022
After the succes of #ArjunSuravaram I signed 4 movies… 4 brilliant scripts that I am very confident about. But Release dates have all gone Haywire.
Praying to God this all sorts out & we release the movies Perfectly