PEDDI Percentage Issue : పెద్ది పర్సెంటేజ్.. నాకు తెలియదన్న నిర్మాత.. స్ట్రాంగ్ కౌంటర్ ఇచ్చిన ఛాంబర్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్ లో ఇటీవల థియేటర్ రెంట్ vs పర్సెంటేజ్ వివాదం తీవ్ర దుమారం రేపిన సంగతి తెలిసిందే. నిర్మాతలు వర్గం, ఎగ్జిబిటర్స్ వర్గం రెండుగా విడిపోయి ఒకరిపై ఒకరు దూషణలు చేసుకుంటు వ్యక్తిగతంగా కామెంట్స్ చేసుకునే వరకు వెళ్ళింది పరిస్థితి. ఆ ప్రభావం ఇటీవల విడుదలైన రామ్ చరణ్ ‘పెద్ది’పై పడుతుందని బావించారు. కానీ పర్సెంటేజ్ విధానంపై అందరు ఒకేమాటపై ఎలాంటి అడ్డంకులు లేకుండా పెద్ది రిలీజ్ కు సహకరించారు. రెండు తెలుగు రాష్ట్రాల్లో పెద్ది భారీ ఎత్తున రిలీజ్ అయింది.
అయితే ఇప్పుడు ‘పెద్ది’ పర్సెంటేజీ వివాదంలో కొత్త ట్విస్ట్ చోటుచేసుకుంది. నైజాంలో పెద్ది టికెట్ల ధరల పెంపుదల ద్వారా వచ్చే వసూళ్లలో ఎగ్జిబిటర్లకు ఇవ్వాల్సిన పర్సెంటేజ్ ఒప్పందంపై ‘పెద్ది’ చిత్ర నిర్మాత వెంకట సతీష్ కిలారు స్పందిస్తూ ‘అసలు ఈ 7.5 శాతం అదనపు వాటా హామీ గురించి తనకు అసలు సమాచారమే లేదు, తన అనుమతి లేకుండానే ఏకపక్షంగా ఈ నిర్ణయం తీసుకున్నారు. తాను సినిమా ప్రమోషన్లలో బిజీగా ఉండటం వల్ల ఈ విషయాలు నా దృష్టికి రాలేదని, అందువల్ల ఈ కమిట్మెంట్ను తాను అంగీకరించలేనని లేఖ విడుదల చేశారు.
Also Read
నిర్మాత చేసిన ఈ వ్యాఖ్యలపై ఫిలిం ఛాంబర్ గట్టిగానే కౌంటర్ ఇస్తూ ‘ఈ వ్యవహారానికి సంబంధించి మే 27వ తేదీనే సదరు నిర్మాతకు అధికారికంగా లేఖ ద్వారా సమాచారం అందించాము. ప్రెస్ నోట్తో పాటు ఈ కమిట్మెంట్కు సంబంధించిన వివరాలను మే 27నే ‘వృద్ధి సినిమాస్’ బ్యానర్కు ఈమెయిల్ తో పాటు కొరియర్ ద్వారా డాక్యుమెంట్స్ పంపాము. ఇప్పడు మాకు తెలియదు అంటే కుదరదు’ అని నిర్మాతకు కౌంటర్ గా లెటర్ రిలీజ్ చేసింది ఛాంబర్. అయితే దీనిపై జూన్ 15న నిర్మాత నుండి తిరస్కరణ సమాధానం రావడంపై ఎగ్జిబిటర్ల సబ్-కమిటీ తీవ్ర అభ్యంతరం వ్యక్తం చేస్తోంది. ఇప్పడు ఈ వివాదం ఎలాంటి సంచలనం సృష్టిస్తుందో చూడాలి.
తాజావార్తలు
-
Abhijeet Dipke: ఓ వైపు ఆమరణ నిరాహార దీక్ష.. మరోవైపు నూడుల్స్, పకోడీలు తింటున్న CJP వ్యవస్థాపకుడు!
-
Tamil Nadu: కరూర్ బాధిత కుటుంబాలకు ప్రభుత్వోద్యోగాలు.. ప్రభుత్వ నిర్ణయంపై హైకోర్టులో సవాల్
-
AP Govt: విద్యార్థులకు శుభవార్త చెప్పిన ఏపీ ప్రభుత్వం.. డైట్ ఛార్జీలు 10 శాతం పెంపు..
-
Nepal: 25 మందిని చంపిన ‘‘కిల్లర్ ఏనుగు’’.. ఒకే కుటుంబంపై రెండుసార్లు దాడి..
-
Bengaluru: రోడ్డుపై నాగుపాము, ట్రాఫిక్ జామ్.. బెంగళూర్ వీడియో వైరల్..
ట్రెండింగ్
-
6500mAh బ్యాటరీ, IP65 రేటింగ్తో రానున్న Vivo T5 Lite 5G.!
-
బడ్జెట్లో ప్రీమియం అనుభవం.. 50MP Sony కెమెరా, 7000mAh బ్యాటరీ, మిలిటరీ గ్రేడ్ డ్యూరబిలిటీతో Moto g77 Power భారత్లో లాంచ్.!
-
Pandu Mirapakaya Pachadi: ఏడాది పాటు నిల్వ ఉండే టేస్టీ ‘పండు మిరపకాయ పచ్చడి’.. ఈ కొలతలు ఫాలో అయితే చాలు!
-
6,500mAh బ్యాటరీ, 50MP కెమెరాలతో ఎంట్రీకి సిద్దమైన iQOO Z11 Lite.!
-
45dB ANC, AI కాల్ రికార్డింగ్, 42 గంటల బ్యాటరీతో Nothing Ear (3a) TWS ఇయర్బడ్స్ లాంచ్..