NTV Telugu Site icon

Nayanthara: ఆటోలో నయనతార కొడుకులు.. వీడియో వైరల్!

Nayanathara Autoride

Nayanathara Autoride

Nayanthara Auto Ride with Her Children: నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ తమ కవల పిల్లలు ఉయిర్, ఉలగ్‌లను చెన్నైలో ఆటో రిక్షా రైడ్‌కు తీసుకెళ్లారు. ఆమె ఈ మేరకు మే 20న తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో ఒక వీడియోను పంచుకున్నారు. రోజూ లగ్జరీ కార్లలో తిరిగే నయనతార తనకు వీలైనప్పుడల్లా పిల్లల్ని ఆటో ఎక్కించడం ఆచారంగా మారింది. నయనతార -దర్శకుడు విఘ్నేష్ శివన్ ఇటీవల చెన్నైలోని తిరుచెందూర్ మరియు కన్యాకుమారిలో ఆధ్యాత్మిక పర్యటనకు వెళ్లారు. కోలీవుడ్లో టాప్ నటి అయినప్పటికీ, తన భర్త మరియు ఇద్దరు పిల్లలతో ఎక్కువ సమయం గడిపే నయనతార, వారితో సరదాగా ఆటోలో ప్రయాణించిన వీడియోను తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీలో పోస్ట్ చేసింది.

Siren Director: పంతం పట్టి డైరెక్టర్ అయ్యాకే పెళ్లి చేసుకున్నాడు!

ఒకప్పుసు సోషల్ మీడియాకి దూరంగా ఉంటూ వచ్చినా ఇన్‌స్టాగ్రామ్‌లోకి ప్రవేశించిన తర్వాత, నయనతార తన కొడుకులతో చాలా ఫొటోలు, వీడియోలను పోస్ట్ చేస్తోంది. నయనతార తన ఇన్‌స్టాగ్రామ్ స్టోరీస్‌లో పంచుకున్న వీడియోలో , ఇద్దరు పిల్లలను వారి ఒడిలో కూర్చోబెట్టడాన్ని మనం చూడవచ్చు, విఘ్నేష్ ప్రతిబింబం అద్దంలో కనిపిస్తుంది. ఇక సినిమాల విషయానికి వస్తే నయనతార చివరిసారిగా వివాదాస్పద చిత్రం ‘అన్నపూర్ణి’లో కనిపించింది, భారీ ట్రోలింగ్స్ తర్వాత నెట్‌ఫ్లిక్స్ నుండి తీసి వేయబడింది. ఈ సినిమా హిందువుల మనోభావాలను దెబ్బతీసేలా ఉందని కొందరు అభ్యంతరం వ్యక్తం చేశారు. మరోపక్క రెండు తమిళ సినిమాలు ‘టెస్ట్’, ‘1960 నుండి మన్నంగట్టి’ షూటింగ్ ముగించింది. ఇటీవల, ఆమె తన మలయాళ చిత్రం ‘డియర్ స్టూడెంట్స్’ షూటింగ్ ప్రారంభించింది.