ఏపీలో థియేటర్ల రేట్ల విషయమై రచ్చ ఇంకా కొనసాగుతున్న విషయం తెలిసిందే. అక్కడ ఉన్న టికెట్ రేట్లను టాలీవుడ్ ప్రముఖులు ఒక్కొక్కరూ ఒక్కోలా పోల్చుతున్నారు. ఒకరు ఇంతకుముందు భారీగా పెరిగిన టమాటో ధరతో పోలిస్తే, మరొకరు తెలంగాణాలో ఉన్న థియేటర్ పార్కింగ్ ఫీజుతో పోల్చారు. మరోవైపు చాలామంది డిస్ట్రిబ్యూటర్లు ఈ రేట్లతో సినిమాలు వేసి నష్టాలూ కొని తెచ్చుకునే కన్నా థియేటర్లు క్లోజ్ చేసుకోవడం మంచిదని భావించి, క్లోజ్ చేశారు కూడా. అక్కడ అఖండ, పుష్ప వంటి పెద్ద సినిమాలు విడుదలైనప్పటి డిస్ట్రిబ్యూటర్లకు నష్టాలు తప్పడం లేదు. ఈ విషయంపై ఎగ్జిబిటర్లు ఆందోళన చెందుతున్నారు. కోర్టుకు వెళ్లినప్పటికీ ఏపీ ప్రభుత్వం ఈ విషయంపై వెనక్కి తగ్గట్లేదు. తాజాగా టాలీవుడ్ నుంచి మరో హీరో వేసిన సెటైర్ సంచలనంగా మారింది.
Read Also :
తాజాగా నాని నటించిన ‘శ్యామ్ సింగ రాయ్’ విడుదలకు సిద్ధమవుతోంది. డిసెంబర్ 24న రిలీజ్ కు సిద్ధంగా ఉన్న ఈ సినిమా ప్రమోషన్లలో భాగంగా తాజాగా ఏర్పాటు చేసిన ప్రెస్ మీట్ లో నాని ఏపీ టికెట్ రేట్ల విషయంపై సెన్సేషనల్ కామెంట్స్ చేశారు. నాని మీడియాతో మాట్లాడుతూ “ఏపీలో టిక్కెట్ల విషయమై ఏం జరుగుతుందో అది కరెక్ట్ కాదని మనందరికీ తెలుసు… మీరు ప్రేక్షకులను అవమానిస్తున్నారు… ఈ పాలిటిక్స్ ను, సినిమాలను అన్నింటినీ పక్కన పెడితే ఇలా చేయడం ప్రేక్షకులను అవమానించినట్టే… ఇప్పటికీ చూస్తున్న టికెట్ రేట్స్ రూ.10, రూ.15, రూ. 20 అని… మళ్ళీ ఇది అనవసరంగా ఏ థంబ్ నెయిల్స్ పెడతారో… రేపు అసలు సినిమా రిలీజ్ కూడా ఉంది… 10 మందికి ఉద్యోగాలు ఇచ్చి థియేటర్లు నడుపుతున్న ఒక వ్యక్తి కౌంటర్ కంటే పక్కనే ఉన్న కిరాణా షాప్ కౌంటర్ ఎక్కువగా ఉంటే కరెక్ట్ కాదు… నా చిన్నప్పుడు స్కూల్లో అందరం పిక్నిక్ కు వెళ్లేవాళ్లం… ఆ టైంలో అందరి దగ్గరా రూ.100 అడిగేవారు. అయితే అదే సమయంలో అందరూ రూ.100 ఇవ్వగలరు… నాని నువ్వు మాత్రం ఇవ్వలేవు… నువ్వు రూ. 0 ఇస్తే చాలు అంటే అది నన్ను ఇన్సల్ట్ చేసినట్టే…” అంటూ చెప్పుకు రావడం సంచలనంగా మారింది.
