NC 23: వైజాగులో బోటెక్కి సముద్రంలో డ్రైవింగ్ నేర్చుకున్న నాగ చైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Nagachaitanya learning boat driving for NC 23: యువ సామ్రాట్ నాగ చైతన్య తను చేయబోయే కొత్త సినిమా #NC23 కోసం సాగరతీరంలోని మత్స్యకారులని కలుస్తున్న సంగతి తెలిసిందే. నిన్న శ్రీకాకుళం జిల్లా గార మండలం కె.మత్స్యలేశం గ్రామానికి వెళ్లి అక్కడి మత్స్యకారులను, వారి కుటుంబాలను కలుసుకుని వారి సంస్కృతి, జీవనశైలిని అర్థం చేసుకున్న చైతూ ఈ రోజు దర్శకుడు చందూ మొండేటి, నిర్మాత బన్నీ వాస్ తో కలిసి వైజాగ్ పోర్టును సందర్శించారు. అంతేకాదు ఈ సందర్భంగా మత్స్యకారులతో కలిసి బోటులో సముద్రంలోకి వెళ్లి సముద్రంలో వేట, ప్రయాణం, అక్కడ ఎదురయ్యే పరిస్థితి గురించి కూడా తెలుసుకున్నారు. నిజానికి నాగచైతన్య చేస్తున్న ఈ గ్రౌండ్ వర్క్ చూస్తుంటే ఆశ్చర్యం అనిపిస్తోంది. సినిమా షూటింగ్ ఇంకా ప్రారంభం కాకముందే ఇలా స్థానికులని కలసి వాస్తవ పరిస్థితులు తెలుసుకుని సహజత్వం ఉట్టిపడేలా నటించాలని ఆయన ప్రయత్నించడం చర్చనీయాంశం అవుతోంది.
Kusuma: వైష్ణవిని చూసి కుసుమ కూడా హాట్ షో మొదలెట్టేసింది.. లేటెస్ట్ పిక్స్ చూశారా?
Also Read
- Kayadu Lohar: ‘ది ప్యారడైజ్’లో కాయదు విలనా.. హీరోయినా? నాని మైండ్ బ్లాంక్ రియాక్షన్!
- The Paradise : ‘ది ప్యారడైజ్’ సీక్రెట్స్ లీక్ చేసిన సంపూర్ణేష్ బాబు! నాని జడల వెనుక అసలు కథ ఇదేనట..
- Sampoornesh Babu: స్టార్డమ్ ముసుగు తీసేసిన సంపూ.. తెరవెనుక అసలైన జీవితం ఇదేనట!
- Viswanath & Sons : నెట్ఫ్లిక్స్ను ఊపేస్తున్న సూర్య సినిమా.. ఇండియాలో నెం.1.. గ్లోబల్గా టాప్-3!
ఇక ఈ ప్రతిష్టాత్మక ప్రాజెక్ట్ కు కార్తికేయ 2తో పాన్ ఇండియా బ్లాక్బస్టర్ను అందించిన చందూ మొండేటి దర్శకత్వం వహిస్తున్నారు. NC 23 అనే టైటిల్తో ఈ క్రేజీ ప్రాజెక్ట్ త్వరలో సెట్స్పైకి వెళ్లనుంది. మెగా ప్రొడ్యూసర్ అల్లు అరవింద్ ఈ చిత్రాన్ని సమర్పిస్తుండగా, టాలీవుడ్ ప్రముఖ నిర్మాణ సంస్థ గీతా ఆర్ట్స్ బ్యానర్పై బన్నీ వాస్ నిర్మించనున్నారు.NC 23 కథనం 2018లో జరిగిన ఒక భయంకరమైన సంఘటన ఆధారంగా కనిపిస్తుంది. కోస్తా ఆంధ్ర నుండి మత్స్యకారులు ప్రతి సంవత్సరం ఫిషింగ్ బోట్లలో పని చేయడానికి గుజరాత్కు వెళతారు. అలా గుజరాత్ బోటు ఓనర్ల దగ్గర జీతానికి పని చేసేటున్న ఆంధ్రాకు చెందిన 22 మంది మూడు పడవలపై గుజరాత్ సముద్రంలోకి వెళ్లారు. వారిని పాకిస్థాన్ అధికారులు పట్టుకుని కరాచీకి తీసుకెళ్ళారు. అక్రమమంగా తమ జలాల్లోకి ఎంటర్ అయ్యారనే వంకతో దాదాపు 13 నెలల పాటు వారిని బందీలుగా చేసుకున్నారు. చివరికి భారత ప్రభుత్వ చొరవతో వారు ఇండియా వచ్చారు. ఈ సంఘటన ఆధారంగా చేసుకుని కె.మత్స్యలేశం గ్రామానికి చెందిన ఒక వ్యక్తి కథ రాయగా గీతా ఆర్ట్స్ కి ఆ కథ నచ్చి చందూ మొండేటి చేతిలో పెట్టిందని అలా ఈ సినిమా పట్టాలు ఎక్కుతుందని అంటున్నారు.
తాజావార్తలు
-
OTR: దానం నాగేందర్ పై వేటు..మిగతా 9 మంది ఎమ్మెల్యేల సంగతేంటి ..?
-
Botsa Anusha: భీమిలి YSRCP నియోజకవర్గ సమన్వయకర్తగా బొత్స అనూష
-
Old Currency: కాజీపేటలో పాత నోట్ల కలకలం.. రూ.1.38 కోట్ల కరెన్సీతో 8 మంది అరెస్ట్!
-
Bhatti Vikramarka : ఎల్నినో ఎఫెక్ట్.. తెలంగాణలో ముందస్తు ప్లాన్
-
Online Shopping: ఆన్లైన్ షాపింగ్ చేస్తున్నారా..? కొత్త రూల్స్ వచ్చేస్తున్నాయ్.. కేంద్రం కీలక నిర్ణయం..
ట్రెండింగ్
-
బడ్జెట్లో Kia Carens Clavis ఆటోమేటిక్.. కొత్త వేరియంట్స్ వచ్చేశాయి.!
-
649cc ఇంజిన్, 14 లీటర్ల ఫ్యూయల్ ట్యాంక్తో Kawasaki Vulcan S కొత్త క్రూయిజర్ బైక్ లాంచ్..!
-
48MP కెమెరా, 7000mAh బ్యాటరీతో Ai+ Nova 2 Power లాంచ్ డేట్ ఫిక్స్.. స్పెసిఫికేషన్స్ ఇవే.!
-
Asian Games 2026: జపాన్పై భారత్ ఘన విజయం.. సెమీస్కు దూసుకెళ్లిన హర్మన్సేన..!
-
Zepto, Blinkitలో భారీ ఆఫర్.. iPhone 18 Pro పై రూ.7,000 డిస్కౌంట్.. 10 నిమిషాల్లోనే మీ చేతిలోకి..