సాయి పల్లవి నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చింది: నాగచైతన్య
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నాగ చైతన్య, సాయిపల్లవి జంటగా నటించిన చిత్రం ‘లవ్ స్టోరీ’.. శేఖర్ కమ్ముల దర్శకత్వం వహించిన ఈ సినిమా సెప్టెంబర్ 24వ తేదీన థియేటర్లోకి రాబోతోంది. ఈ సందర్బంగా ప్రీ రిలీజ్ ఈవెంట్ ను హైదరాబాద్ లో నిర్వహించారు. ఈ ఈవెంట్ కు ముఖ్య అతిథులుగా మెగాస్టార్ చిరంజీవి, బాలీవుడ్ స్టార్ అమీర్ ఖాన్ హాజరైయ్యారు.
నాగ చైతన్య మాట్లాడుతూ….మెగాస్టార్ చిరంజీవి గారికి నా కార్యక్రమానికి వచ్చినందుకు థాంక్స్. ఆయన సినిమాల్లో మెగాస్టార్, బయట మెగా హ్యూమన్ బీయింగ్. కరోనా పాండమిక్ టైమ్ లో ఎంతోమంది కార్మికులకు సాయం చేశారు. మీరు ఇండస్ట్రీకి ఇచ్చిన సపోర్ట్ ఇన్ స్పైరింగ్ గా ఉంది. లవ్ స్టోరి ట్రైలర్ చూసి అమీర్ ఖాన్ గారు మెసేజ్ చేశారు. సండే ఏంటి ప్రోగ్రాం అని ఆయన అడగగానే ఇలా ప్రీ రిలీజ్ ఈవెంట్ ఉంది అని చెప్పాను. నేను వస్తాను అన్నారు. ఆయన ఆ మాట అనగానే నమ్మలేకపోయాను. 45 రోజులు లాల్ సింగ్ చద్దా సినిమా కోసం అమీర్ ఖాన్ గారితో పనిచేశాను. ఆ టైమ్ లో నేను మీ నుంచి ఎంతో నేర్చుకున్నాను. అది జీవితాంతం గుర్తు పెట్టుకుంటాను. మా అభిమానులను మిస్ అవుతున్నానని తెలుసు. కానీ పాండమిక్ పరిస్థితుల వల్ల కొంతమంది అభిమానులనే కలవగలుగుతున్నాను.
Also Read
లవ్ స్టోరి విషయానికి వస్తే, నేను ఇప్పటిదాకా ఏ సినిమాకూ ఇంత ఇన్ స్పైర్ కాలేదు, ఏ క్యారెక్టర్ ఇంత డెప్త్ లోకి వెళ్లి చేయలేదు. శేఖర్ కమ్ముల గారి వల్లే నేను ఇంత ఇన్ వాల్వ్ అయి లవ్ స్టోరి చిత్రంలో నటించగలిగాను. శేఖర్ గారి దర్శకత్వంలో పనిచేస్తున్నప్పుడు ఆయన కథ లో, క్యారెక్టర్ లో వెళ్లే డెప్త్ చూసి, ఈ మనిషి కోసం ఎంత దూరం అయినా వెళ్లొచ్చు అనిపించింది. ఇండస్ట్రీలో నా ఫ్రెండ్స్ అయిన హీరోలకు ఎప్పుడూ చెబుతుంటాను దర్శకుడు శేఖర్ కమ్ముల గారితో అవకాశం వస్తే సినిమా వదులుకోకండి. ఆయనతో సినిమా చేశాక మంచి నటుడు అవుతారు, మంచి పర్సన్ అవుతారు, నేనూ అలాగే మారాను. మీరు ఏదీ నేర్పించలేదు. మేమే నేర్చుకున్నాం. ఒకట్రెండు చాలా ఇంపార్టెంట్ ఇష్యూస్ శేఖర్ కమ్ముల గారు లవ్ స్టోరిలో చెప్పబోతున్నారు. అవి 24న థియేటర్ లో చూస్తారు. ఇలాంటి సినిమాలో నటించడం పట్ల చాలా గర్వంగా ఫీల్ అవుతున్నాను. ఒక సెన్సిటివ్ ఇష్యూను గురించి సినిమా చేయాలంటే ధైర్యం కావాలి. మా దర్శకుడికి ఆ ధైర్యం ఉంది. ఏడాది ఏడాదిన్నరగా సినిమాను హోల్డ్ చేసిన నిర్మాతలకు థాంక్స్. మనం కలిసి మరిన్ని సినిమాలు చేయాలి. సాయి పల్లవి ఆన్ స్క్రీన్ నాకు ఎంతో ఎనర్జీ ఇచ్చింది. 24న మా సినిమా విడుదల అవుతోంది. ఇదో మ్యాజిక్ డేట్ లా అనిపిస్తోంది. తాతగారి ప్రేమనగర్ 50 ఏళ్ల క్రితం ఇదే రోజున విడుదలైంది. మిమ్మల్ని థియేటర్స్ లో చూసేందుకు ఎదురుచూస్తున్నాను. అన్నారు.
తాజావార్తలు
-
The India Story : కాజల్ అగర్వాల్ ‘ది ఇండియా స్టోరీ’కి షాక్.. తెలుగు, తమిళ్ రిలీజ్ వాయిదా!
-
KTR : గ్లోబరీనా వివాదం.. రేవంత్కు కేటీఆర్ డిఫమేషన్ నోటీసు
-
CJP Protest: దుకాణాలు బంద్, జాతీయ భద్రతా చట్టం, అంబులెన్సుల మోహరింపు.. ఏదో జరగబోతోంది..
-
Monsoon: దేశంలో వర్ష మేఘాల బెల్ట్.. వెలుగులోకి ఉపగ్రహ చిత్రాలు.. ఇక భారీ వర్షాలే!
-
Home Tips : ఎండిపోయిన పాత కొబ్బరిని పడేస్తున్నారా? ఇంట్లోనే ప్యూర్ కొబ్బరి నూనె..!
ట్రెండింగ్
-
SBI నుంచి రూ.15 లక్షల వరకు స్కాలర్షిప్.. విద్యార్థులు దరఖాస్తు ఎలా చేసుకోవాలంటే.?
-
Punya Kshetra Yatra: భక్తులకు శుభవార్త.. అయోధ్య, కాశీ, పూరీ, ప్రయాగ్రాజ్.. పుణ్యక్షేత్ర యాత్ర స్పెషల్ రైలు.. వివరాలు ఇదిగో.!
-
Pachimirapakaya Pachadi: తిన్నకొద్దీ తినాలనిపించే “పచ్చిమిరపకాయ రోటి పచ్చడి” చేసేయండి ఇలా.!
-
IND vs ZIM 1st T20: వైభవ్ సూర్యవంశీకి షాక్.. కెప్టెన్ శ్రేయస్ అయ్యర్ దోస్తుకు ఛాన్స్?
-
Dinesh Karthik vs Alastair Cook: ఐపీఎల్ గురించి వాడివేడి చర్చ.. ఇంటర్వ్యూలోనే కొట్టుకోబోయిన దినేష్ కార్తీక్, అలిస్టర్ కుక్!