స్టార్ డాన్స్ కొరియోగ్రాఫర్, యాక్టర్, డైరెక్టర్ ప్రభుదేవా తాజా చిత్రం ‘మై డియర్ భూతం’. వైవిద్యభరితమైన కథతో అవుట్ అండ్ అవుట్ కిడ్స్ ఫాంటసీ మూవీగా ఇది ప్రేక్షకుల ముందుకు రాబోతోంది.
ఎన్. రాఘవన్ దర్శకత్వంలో రమేష్ పి పిళ్ళై ఎంతో ప్రతిష్టాత్మకంగా దీనిని నిర్మిస్తున్నారు. శ్రీలక్ష్మి జ్యోతి క్రియేషన్స్ అధినేత ఏఎన్ బాలాజీ ఈ సినిమాను తెలుగులో విడుదల చేస్తున్నారు. డిఫరెంట్ కాన్సెప్ట్, అంతకు మించిన నిర్మాణ విలువలతో రూపొందుతున్న ఈ సినిమా షూటింగ్ కంప్లీట్ కావడంతో ప్రమోషన్స్ వేగవంతం చేశారు. ఇందులో భాగంగా తాజాగా ‘మై డియర్ భూతం’ మూవీ నుంచి ఫస్ట్ సాంగ్ ను మేకర్స్ రిలీజ్ చేశారు.
‘మాస్టర్ ఓ మై మాస్టర్..’ అంటూ ఫాస్ట్ బీట్తో సాగిపోయే ఈ పాటలో ప్రభుదేవా డాన్స్ హైలైట్ నిలిచింది. ఎప్పటిలాగే స్టైలిష్ స్టెప్స్తో ఆకట్టుకున్నారు ప్రభుదేవా. ‘నీ మనసు కన్న కలలు అన్నీ చూసేయ్.. చూసేయ్.. నిన్ను మించినోడు లేనేలేడు ఆడేయ్ పాడేయ్’ సాగే ఈ పాటను డాక్టర్ చల్లా భాగ్యలక్ష్మి రాయగా, అరవింద్ అన్నెస్ట్ గానం చేశారు. రాజేష్, డి. ఇమ్మాన్ కట్టిన బాణీలు ఈ సాంగ్ లెవెల్ ను పెంచేశాయి. పాటకు తగ్గట్టుగా డిఫరెంట్గా చూపించిన విజువల్స్ ఆకట్టుకున్నాయి. మొత్తంగా చెప్పాలంటే ఈ సాంగ్ ‘మై డియర్ భూతం’ సినిమాకు మేజర్ అట్రాక్షన్ అవుతుందని స్పష్టమవుతోంది. విడుదలైన కాసేపట్లోనే ఈ సాంగ్ నెట్టింట వైరల్గా మారడం విశేషం. ఈ ఫాంటసీ మూవీలో జీనీగా ప్రభుదేవా నటిస్తున్నారు. ఓ మంచి మెసేజ్ ఇస్తూ జీనీకి కిడ్స్కి మధ్య జరిగే సన్నివేశాలతో ఈ మూవీ అలరించనుందని, జీనీ పాత్రలో ప్రభుదేవా ఒదిగిపోయారని, ఆయన లుక్ ఎంతో పర్ఫెక్ట్గా సెట్ అయిందని, ఈ మేకోవర్ నేచురల్గా ఉండేందుకు ఎంత కష్టపడ్డారో రీసెంట్గా విడుదల చేసిన ఫస్ట్ లుక్ పోస్టర్ కన్ఫర్మ్ చేసిందని తెలుగు నిర్మాత బాలాజీ తెలిపారు. రమ్య నంబీసన్, బిగ్ బాస్ తమిళ్ ఫేమ్ సంయుక్త, ఇమ్మాన్ అన్నాచి, సురేష్ మీనన్, లొల్లు సభా, స్వామినాథన్ ఇతర ప్రధాన పాత్రలు పోషించారు.