1921: Puzha Muthal Puzha Vare: సెన్సార్ బోర్డ్ పై మలయాళ దర్శకుడు ఫైర్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
ప్రముఖ మలయాళీ దర్శకుడు అలీ అక్బర్ కేరళ సెన్సార్ బోర్డ్ మీద, ముంబైలోని కేంద్ర సెన్సార్ బోర్డ్ మీద గుస్సా అవుతున్నాడు. తాను మలయాళంలో తెరకెక్కించిన ‘పుళ ముత్తల్ పుళ వారె’ చిత్రాన్ని జనం ముందుకు తీసుకు రానీయకుండా సెన్సార్ బోర్డ్ అడ్డుకుంటోందని వాపోతున్నాడు. అయితే అలీ అక్బర్ ఆరోపణల వెనుక చాలా ఆసక్తికరమైన కథ ఉంది. 1921లో ఖిలాఫత్ ఉద్యమ సమయంలో మలబార్ ప్రాంతంలో హిందువుల మీద ముస్లింలు దాడులకు తెగబడ్డారు. అనేక మంది హిందువులను మత మార్చారు, అందుకు అంగీకరించని వారిని హతమార్చారు. దీనిపైనే ‘పుళ ముత్తల్ పుళ వారె’ చిత్రాన్ని అలీ అక్బర్ తెరకెక్కించాడు. అయితే ఆయన ఓ ముస్లింగా ఈ సినిమాను తీయలేదు. కొంతకాలం క్రితం అతను హిందువుగా మారాడు. తన పేరును రామ సింహన్ గా మార్చుకున్నాడు. కేరళలో కొన్ని దశాబ్దాలకు పైగా ముస్లింలు హిందువులను హింసిస్తున్నారన్నది ఆయన వాదన. కేరళలోని ప్రభుత్వం అండతో హిందువులను కించపరుస్తూ, ముస్లింలను, క్రైస్తవులను ఆకాశానికి ఎత్తుతూ ఎన్నో సినిమాలు వచ్చాయని, వాటికి సెన్సార్ వారు ఎలాంటి అభ్యంతరం పెట్టలేదని, కానీ తన చిత్రం దగ్గరకు వచ్చేసరికీ అసలు సర్టిఫికెట్ ఇవ్వడానికే నిరాకరించారని అలీ అక్బర్ ఆరోపిస్తున్నాడు.
Also Read
- Tollywood Debut: బిగ్ బాస్ బ్యూటీకి బిగ్ ఛాన్స్.. హీరోయిన్గా టాలీవుడ్లోకి ఎంట్రీ!
- Renukaswamy Case: రేణుకాస్వామి మర్డర్ కేసులో దర్శన్కు భారీ ఎదురుదెబ్బ..
- Yash, NTR , Nani Films: యశ్, ఎన్టీఆర్, నాని.. ముగ్గురి సినిమాల్లో కామన్ పాయింట్ ఇదేనా! ‘టాక్సిక్’, ‘డ్రాగన్’, ‘ది ప్యారడైజ్’పై ఆసక్తికర చర్చ..
- Kaka vs House No 47: పాత ఫార్ములానే రిపీట్ చేస్తున్నారా? చిరు, వెంకీ సినిమాలపై ఆసక్తికర చర్చ!

కేరళలోని ప్రాంతీయ సెన్సార్ బోర్డ్ సభ్యులు కొన్ని కట్స్ తో తన సినిమాకు సర్టిఫికెట్ ఇవ్వవచ్చని అన్నారని, కానీ రీజనల్ ఆఫీసర్ పార్వతి సర్టిఫికెట్ ఇవ్వడానికి నిరాకరించారని అలీ అక్బర్ తెలిపారు. ఆమెకు ప్రస్తుత రాష్ట్ర ప్రభుత్వంతో సత్ సంబంధాలు ఉన్నాయని, అందుకే కేంద్ర ప్రభుత్వం కూడా ఆమె పదవీకాలం పూర్తి అయినా ఇంకా మార్చలేదని విమర్శించారు. ఇక కేరళలో ప్రస్తుతం రివైజింగ్ కమిటీ లేదని, దానికి ఛైర్మన్ గా ఉన్న షాజీ ఎన్ కరణ్, మోదీ ప్రభుత్వం కేంద్రంలో ఏర్పడిన తర్వాత తన పదవికి రాజీనామా చేశారని, ఆ స్థానంలో వేరెవరినీ నియమించలేదని తెలిపారు. ఎన్నో ఆశలతో ముంబైలోని సెన్సార్ బోర్డ్ కు వెళ్ళినా అక్కడ కూడా కుహనా మేధావులతో కూడిన కమిటీ తన సినిమాకు అనేక కట్స్ ఇచ్చిందని, వాటన్నింటినీ తొలగిస్తే… సినిమా ఆత్మ పోతుందని అలీ అక్బర్ వాపోయాడు. కేంద్రంలో బీజేపీ ప్రభుత్వం ఉన్నా సెన్సార్ బోర్డ్ లో మాత్రం హిందూవ్యతిరేక శక్తులదే పైచేయిగా ఉందని, ఈ దేశంలో స్వతంత్య్రానికి పూర్వం హిందువులకు జరిగిన అన్యాయాలను ప్రజలకు తెలియచేద్దామంటే సెన్సార్ బోర్డ్ సహకరించడం లేదని తెలిపాడు. మరి అలీ అక్బర్ అలియాస్ రామ సింహన్ కు ఎప్పుడు న్యాయం జరుగుతుందో వేచి చూడాలి. ఒక రకంగా చూస్తే…. కశ్మీర్ లో హిందువులపై జరిగిన మారణకాండ నేపథ్యంలో వచ్చిన ‘ది కశ్మీర్ ఫైల్స్’కు సెన్సార్ సర్టిఫికెట్ లభించడం అదృష్టమనే చెప్పాలి!
తాజావార్తలు
-
Healthy Snacks: నో జంక్.. ఓన్లీ హెల్తీ స్నాక్! ఒక్కసారి చేస్తే మళ్లీ మళ్లీ చేస్తారు..
-
Karnataka: ఆకస్మిక తనిఖీలో షాకింగ్ సీన్.. ఆస్పత్రి రూమ్లో ప్రియురాలితో అడ్డంగా బుక్కైన..!
-
Kishan Reddy: రేవంత్ అమెరికా టూర్ రద్దు.. కిషన్ రెడ్డి కౌంటర్..!
-
Arvind Kejriwal: ఆప్ గెలిస్తే 5 రోజుల్లో E20 పెట్రోల్ బ్యాన్.. కేజ్రీవాల్ హామీ..
-
BJP: ‘‘మనుస్మృతి’’పై రాహుల్ గాంధీ వ్యాఖ్యలు.. ‘‘హిజాబ్’’ వీడియోతో బీజేపీ కౌంటర్..
ట్రెండింగ్
-
Medhavi Bidhuri: ‘6-7’ సెలబ్రేషన్తో వైరల్.. ఇప్పుడు వికెట్ల వేటలో తోపు.. ఎవరు ఈ ‘మెధావి బిధూరి’.?
-
Viral Love Story: తైవాన్ అబ్బాయి.. భారత్ అమ్మాయి.. రాత్రికి రాత్రే ఇండియాలో సెన్సేషన్.. కట్చేస్తే..
-
144Hz డిస్ప్లే, కొత్త కలర్ ఆప్షన్లతో సెప్టెంబర్ 4న రాబోతున్న Infinix Hot 70 Pro 5G.!
-
ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్, 2TB వరకు స్టోరేజ్, 50MP కెమెరాతో Sony Xperia 10 VIII లాంచ్..!
-
Green Chillies Plant Grow: కుండీలో పచ్చిమిరపకాయలు విరగకాయాలంటే ఇలా చేయండి.. ఈ జాగ్రత్తలు తప్పనిసరి!