పాన్ ఇండియా బాక్సాఫీస్ దగ్గర ఒక ఊహించని కాంబో రెడీ అవుతుందా? అంట, ఇండస్ట్రీ వర్గాల్లో అవుననే మాట జోరుగా వినిపిస్తోంది. టాలీవుడ్ సూపర్ స్టార్ మహేశ్ బాబు, సెన్సేషనల్ డైరెక్టర్ ప్రశాంత్ నీల్ కాంబినేషన్లో ఒక భారీ ప్రాజెక్ట్ రాబోతుందనే వార్త సోషల్ మీడియాను షేక్ చేస్తోంది. ప్రస్తుతం ఈ మోస్ట్ అవేటెడ్ ప్రాజెక్ట్కు సంబంధించిన ప్రాథమిక చర్చలు జరుగుతున్నట్లు గట్టిగా చర్చ నడుస్తోంది. ప్రజెంట్ ఈ ఇద్దరు తమ తమ ప్రతిష్టాత్మక చిత్రాలతో బిజీగా ఉన్నారు. మహేష్ బాబు స్టార్ డైరెక్టర్ ఎస్.ఎస్. రాజమౌళి దర్శకత్వంలో తెరకెక్కుతున్న గ్లోబల్ అడ్వెంచరస్ డ్రామా ‘వారణాసి’ చిత్రంతో బిజీగా ఉండగా, ప్రశాంత్ నీల్ ఎన్టీఆర్ ‘డ్రాగన్’తో బిజీగా ఉన్నాడు.
ఆ తర్వాత ప్రభాస్తో ‘సలార్ 2’ వంటి భారీ పాన్-ఇండియా ప్రాజెక్ట్ కమిట్ అయి ఉన్నాడు. ఆ తర్వాతే ఈ క్రేజీ కాంబో సెట్ అయ్యే ఛాన్స్ ఉందని రూమర్స్ వైరల్ అవుతున్నాయి. ఒకవేళ నిజంగానే ఈ కాంబో సెట్ అయితే మాత్రం.. మామూలుగా ఉండదనే చెప్పాలి. ప్రశాంత్ నీల్ మార్క్ పవర్ఫుల్ ఎలివేషన్స్, స్టోరీ నరేషన్కు.. సూపర్ స్టార్ మహేశ్ బాబు అల్టిమేట్ స్క్రీన్ ప్రెజెన్స్, యాక్టింగ్ తోడైతే, ఇండియన్ సినిమా బాక్సాఫీస్ వద్ద సరికొత్త ట్రెండ్ క్రియేట్ అవ్వడం ఖాయమని ఫ్యాన్స్ అప్పుడే లెక్కలు వేసుకుంటున్నారు. అయితే, ప్రస్తుతం వీరిద్దరి చేతిలో ఉన్న కమిట్మెంట్స్ అన్నీ పూర్తయిన తర్వాతే ఈ క్రేజీ కాంబినేషన్పై స్పష్టత వచ్చే అవకాశం ఉంది. ఏదేమైనా ఈ క్రేజీ కాంబో న్యూస్ మాత్రం ప్రస్తుతం ఇండస్ట్రీలో హాట్ టాపిక్గా మారింది.
