M.S Raju: ముదురు జంటతో యమ్మెస్ రాజు ప్రయత్నం ఫలించేనా!?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
M.S Raju: ఇప్పుడైతే యమ్.యస్.రాజు అంటే ఓ నాటి నిర్మాత అని కొందరు భావించవచ్చు. కానీ, రెండు దశాబ్దాల క్రితం యమ్మెస్ రాజు సినిమా వస్తోందంటే, అగ్ర కథానాయకులు సైతం తమ చిత్రాన్ని విడుదల చేయాలా వద్దా అని ఆలోచించేవారు. అంతలా ఓ వెలుగు వెలిగిన యమ్మెస్ రాజు కాసింత నెమ్మదించారే కానీ, చిత్రసీమకు దూరంగా జరగలేదు. ప్రస్తుతం యమ్మెస్ రాజు దర్శకత్వంలో రూపొందిన ‘మళ్ళీ పెళ్ళి’ చిత్రం చర్చనీయాంశమయింది. అందులో సీనియర్ యాక్టర్ నరేశ్, నటి పవిత్రా లోకేశ్ నటించడంతోనే ఈ చర్చ సాగుతోంది. అదలా ఉంచితే, ఇరవై ఏళ్ళ క్రితం యమ్మెస్ రాజును అందరూ ‘పొంగల్ రాజు’ అంటూ కీర్తించేవారు. ఆయన నిర్మించిన “ఒక్కడు, వర్షం, నువ్వొస్తానంటే నేనొద్దంటానా” చిత్రాలు వరుసగా 2003, 2004, 2005 సంవత్సరాల్లో సంక్రాంతికి విడుదలై విజయవిహారం చేశాయి. ఈ చిత్రాలలో నటించిన మహేశ్, ప్రభాస్, సిద్ధార్థ్ మరపురాని ఘన విజయాలను అందుకోవడం గమనార్హం!
యమ్మెస్ రాజు తండ్రి రాయపరాజు సైతం నిర్మాతగా చిత్రసీమలో సాగారు. ఆయన నిర్మించిన చిత్రాలు ఆట్టే అలరించక పోయాయి. తండ్రిని మించిన తనయునిగా యమ్మెస్ రాజు సక్సెస్ రూటులో సాగారు. వెంకటేశ్ తో నిర్మించిన ‘శత్రువు’తో నిర్మాతగా యమ్మెస్ రాజుకు ఓ గుర్తింపు లభించింది. ఆ చిత్రదర్శకుడు కోడి రామకృష్ణతో రాజు అనుబంధం విడదీయరానిది. కోడి దర్శకత్వంలోనే రాజు నిర్మించిన ‘దేవి’ చిత్రం కూడా ఘనవిజయం సాధించింది. ఈ సినిమాతోనే దేవిశ్రీ ప్రసాద్ సంగీత దర్శకునిగా పరిచయం కావడం విశేషం! ఇక ‘చిత్రం, నువ్వు-నేను’ చిత్రాలతో సక్సెస్ రూటులో సాగుతున్న ఉదయ్ కిరణ్ కు వాటిని మించిన హిట్ ను తన ‘మనసంతా నువ్వే’తో అందించారు రాజు. అప్పటి దాకా ఓ మోస్తరు హిట్స్ తో సాగుతున్న మహేశ్ బాబుకు తన ‘ఒక్కడు’తో తొలి ఘనవిజయాన్ని కట్టబెట్టారు. అలాగే సక్సెస్ కోసం పరితపిస్తున్న ప్రభాస్ కు ‘వర్షం’తో మొదటి సూపర్ హిట్ ను అందించిందీ యమ్మెస్ రాజునే! ఇక తమిళంలో రాణిస్తున్న సిద్ధార్థ్ ను తమ ‘నువ్వొస్తానంటే నేనొద్దంటానా’తో తెలుగువారికి పరిచయం చేసిందీ ఆయనే! ఈ సినిమా సైతం హిట్ గా నిలచింది.
Also Read
- AAA Cinemas Vizag: ఈసారి పుష్పరాజ్ని కలవడం కష్టమే.. వైజాగ్ AAA ఓపెనింగ్కు ఫ్యాన్స్కు నో ఎంట్రీ!
- Shahid Kapoor: అల్లు అర్జున్ ఫ్యాన్స్కు క్రేజీ న్యూస్! AA23లో ఆ బాలీవుడ్ హీరో ఎంట్రీ?
- Arun Matheswaran: స్టార్ డైరెక్టర్ లోకేష్ కనగరాజ్ను హీరోగా ఎలా ఒప్పించాడో చెప్పిన డీసీ డైరెక్టర్!
- Varun Tej: ఆ హీరోయిన్ను ఎందుకు పెళ్లి చేసుకున్నాడో చెప్పిన వరుణ్ తేజ్!
రాజు కెరీర్ లో భారీ విజయాలు ఉన్నాయి; అలాగే పరాజయాలూ చోటు చేసుకున్నాయి. యమ్మెస్ రాజు సినిమాలను పరిశీలిస్తే వాటిలో ఆయన అభిరుచి కనిపిస్తుంది. కథకు తగ్గట్టుగా ఖర్చు చేసేవారాయన. అలాంటి రాజుకు సిద్ధార్థ్, ఇలియానాతో నిర్మించిన ‘ఆట’ పరవాలేదనిపించింది. ఆ తరువాత నుంచీ పరాజయాలే పలకరించసాగాయి. ‘వాన’ చిత్రంతో మెగాఫోన్ పట్టి డైరెక్టర్ అయిన రాజుకు ఆ సినిమా సైతం నిరాశ మిగిల్చింది. తనయుడు సుమంత్ అశ్విన్ ను హీరోగా పరిచయం చేస్తూ ‘తూనీగ తూనీగ’ చిత్రాన్ని స్వీయ దర్శకత్వంలో తెరకెక్కించారు రాజు. ఆ పై ‘డర్టీ హరీ, 7 డేస్ 6 నైట్స్’ తీసినా రాజుకు ఆశించిన సక్సెస్ దరి చేరలేదు. ఇప్పుడు ముదురు జంట నరేశ్, పవిత్రతో రాజు దర్శకత్వంలో రూపొందిన ‘మళ్ళీ పెళ్ళి’ అయినా ఆయనకు ఊరట కలిగిస్తుందేమో చూడాలి.
తాజావార్తలు
-
Story Board: తమిళనాడులో ప్రతీకారమే రాజకీయమా..? కరుణ, జయ దగ్గర నుంచి విజయ్ దాకా అదే తీరా..?
-
Krishna River Management Board: శ్రీశైలం, సాగర్ నీటిపై ఏపీ కీలక ప్రతిపాదన.. కేఆర్ఎంబీకి లేఖ
-
PM Modi: ప్రధాని మోడీ మరో ఇన్స్టాగ్రామ్ వీడియో.. ఈసారి ఏమన్నారంటే..
-
Off The Record: ఆసిఫాబాద్ కాంగ్రెస్లో అసంతృప్తి అగ్గి.. డీసీసీ అధ్యక్షురాలిపై తిరుగుబాటు?
-
Tour Of South Africa: సౌతాఫ్రికా షెడ్యూల్లో కీలక మార్పులు.. టీ20లు కూడా అక్కడే..
ట్రెండింగ్
-
రూ.9.99 లక్షలకే పెట్రోల్, డీజిల్, CNG ఆప్షన్లతో Tata Nexon Camo ఎడిషన్ లాంచ్..!
-
6.99 అంగుళాల 120Hz OLED డిస్ప్లే, 8,000mAh బ్యాటరీతో REDMI Note 17 5G లాంచ్..!
-
Crispy Wheat Flour Snacks: బయటి జంక్ ఫుడ్కి బై..బై.. ఇంట్లోనే గోధుమపిండితో కరకరలాడే హెల్తీ స్నాక్స్ చేసేయండి ఇలా.!
-
Best EV Bikes: బెస్ట్ మైలేజ్, అదిరే ఫీచర్లతో రూ.1.50 లక్షలలోపు కొనుగోలు చేయగల టాప్-5 EV బైక్లు ఇదిగో..!
-
Incredible Story: దేశవాళీ క్రికెట్లో 9 వేల రన్స్.. టీమిండియా డెబ్యూలోనే హాఫ్ సెంచరీ.. కానీ అడ్రస్ లేకుండా పోయిన ఓపెనర్!