శ్రీరామ్ రాఘవన్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న థ్రిల్లర్ “మెర్రీ క్రిస్మస్”. విజయ్ సేతుపతి, కత్రినా కైఫ్ జంటగా డిసెంబర్ 2021లో ఈ సినిమాను ప్రారంభించారు. తాజాగా సినిమా రెండవ షెడ్యూల్ను తిరిగి ప్రారంభించారు. సమాచారం ప్రకారం స్టార్స్ ఇద్దరూ ఈ సినిమా కోసం 45 రోజులు కేటాయించారు. ముంబైలోని గోరేగావ్లోని ఫిల్మిస్తాన్ స్టూడియోస్లో థ్రిల్లర్ షూటింగ్ జరుపుకుంటోంది. సినిమాలోని నటీనటులు, సిబ్బంది హోలీ కోసం కాస్త విరామం తీసుకోగా, మళ్లీ ఈరోజు షూటింగ్ ప్రారంభించనున్నారు.
Read Also : RRR : ప్రీమియర్ షోలకు వ్యతిరేకత !?
ఈ అద్భుతమైన థ్రిల్లర్ క్రిస్మస్ ఈవ్లో జరిగే ఒక సంఘటన గురించి తెలుపుతుంది. ఈ సినిమా కోసం మేకర్స్ ఒక ఇంటి సెట్ను నిర్మించారు. విజయ్, కత్రినా పాత్రలు గ్రే షేడ్స్ లో ఉంటాయట. ఏప్రిల్లో సినిమా రెండవ షెడ్యూల్ను పూర్తి చేస్తామని, ఆ తర్వాత చివరి దశను మే, జూన్లో చిత్రీకరిస్తామని, సినిమా మొత్తం ముంబైలో, సెట్స్లో అలాగే లైవ్ లొకేషన్లలో చిత్రీకరణ జరుపుకుంటుందని నిర్మాత రమేష్ తౌరానీ చెప్పుకొచ్చారు. కత్రినా, విజయ్ జంటను తెరపై చూడడానికి ప్రేక్షకులు ఆసక్తిగా ఎదురు చూస్తున్నారు.
