యంగ్ హీరో బెల్లంకొండ సాయి శ్రీనివాస్ ‘ఛత్రపతి’ రీమేక్ తో బాలీవుడ్ ఎంట్రీ ఇవ్వబోతున్నాడు. వి. వి. వినాయక్ దర్శకత్వంలో తెరకెక్కుతున్న ఈ సినిమా షూటింగ్ శరవేగంగా సాగుతోంది. దీని తర్వాత సాయి శ్రీనివాస్ ‘స్టూవర్ట్ పురం దొంగ’ మూవీని పట్టాలెక్కించాల్సి ఉంది. ఇదిలా ఉంటే… తెలుగు మూలాలు కలిగిన ప్రముఖ హిందీ హాస్య నటుడు జానీ లివర్ ‘ఛత్రపతి’ రీమేక్ లో నటిస్తున్నాడు. ఈ విషయాన్ని చిత్ర కథానాయకుడు బెల్లంకొండ శ్రీనివాస్ తన సోషల్ మీడియా అకౌంట్ ద్వారా తెలిపాడు.
జానీ లివర్ తో ఉన్న ఫోటోలను పోస్ట్ చేస్తూ, ‘లెజండరీ యాక్టర్ జానీ లివర్ తో కలసి స్క్రీన్ ను షేర్ చేసుకునే అవకాశం లభించడం గౌరవంగా భావిస్తున్నానని, సెట్ లో జానీ లీవర్ కారణంగా చెప్పలేనంత ఎనర్జీ అందరిలోనూ ప్రవేశిస్తుంటుంద’ని బెల్లంకొండ శ్రీనివాస్ పేర్కొన్నాడు. విశేషం ఏమంటే… స్వస్థలాన్ని వదిలి ముంబైలో స్థిరపడిన జానీ లివర్ ఇప్పటికీ చక్కని తెలుగును మాట్లాడతారు!
