IFFI 2023: ఇదేంటి ఆస్కార్ కొట్టినా.. తెలుగు భాష ఉందని మర్చిపోయారా?
- Follow Us :
-
-
Add as a preferred
source on google
Indian Panorama 2023 Official Selection for 54th IFFI, 2023: ఈ సంవత్సరం గోవా ఫిల్మ్ ఫెస్టివల్ అంటే ఇంటర్నేషనల్ ఫిల్మ్ ఫెస్టివల్ ఆఫ్ ఇండియా సందర్భంగా ఇండియన్ పనోరమలో ప్రదర్శించాల్సిన 25 ఫీచర్ ఫిల్మ్స్, 20 నాన్ ఫీచర్ ఫిల్మ్స్ జాబితాను నేషనల్ ఫిల్మ్ డెవలప్మెంట్ కార్పొరేషన్ (NFDC) సోమవారం విడుదల చేసింది. గోవా ఫిలిం ఫెస్టివల్లో NFDC, సమాచార & ప్రసార మంత్రిత్వ శాఖ ప్రతి సంవత్సరం ఈ కేటగిరీ కింద కంటెంట్, ప్రొడక్షన్, ఆర్ట్ లో ఉన్నత ప్రమాణాలకు కట్టుబడి ఉండే సినిమాలను దేశవ్యాప్తంగా ఎంపిక చేస్తుంది. గోవా ఫిల్మ్ ఫెస్టివల్లోని పనోరమా విభాగంలో ఏదైనా సినిమా ఎంపిక చాలా గౌరవప్రదంగా పరిగణించబడుతుంది. ఈ సినిమాకి భారతీయ సినిమా యొక్క ప్రాతినిధ్య చిత్రాలుగా మాత్రమే పరిగణించబడవు, కానీ తరువాత, ఈ సినిమాలను భారత ప్రభుత్వం జాతీయ -అంతర్జాతీయ చలనచిత్రోత్సవాలలో భారతదేశం యొక్క ప్రతినిధి చిత్రాలుగా కూడా పంపబడతాయి. 1978లో ప్రారంభమైన ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపికైన చిత్రాల దర్శకులను కూడా గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ఘనంగా సత్కరిస్తారు.
Ram Charan: సంప్రదాయాన్ని కొనసాగిస్తూ వారితో కలిసి రామ్చరణ్ దంపతుల దసరా
Also Read
- Rashmika Mandanna: గానకోకిల బయోపిక్లో నేషనల్ క్రష్.. క్లాప్ కొట్టిన కమల్ హాసన్!
- CBFCలో ప్రక్షాళన.. కొత్త టీమ్లో ప్రీతి జింటా, సుప్రియ! కొత్త పాలకమండలి ఇదే..
- Anant Nag: కేజీఎఫ్ నటుడికి దాదాసాహెబ్ ఫాల్కే.. సినీ లెజెండ్పై ప్రధాని మోడీ పొగడ్తల వర్షం!
- The Paradise: కాకులు వేటకు సిద్ధమయ్యాయి.. నాని 'ది ప్యారడైజ్' టూర్ షెడ్యూల్ ఇదే! ప్రీ రిలీజ్ ఈవెంట్ ఎప్పుడంటే?
అయితే ఈ ఏడాది అసలు తెలుగు భాష ఒకటి ఉందని, అక్కడి సినిమాలు కూడా ఆస్కార్ అవార్డు అందుకున్నాయి అని తెలియలేదో ఏమో కానీ ఏకంగా అసలు ఒక్క తెలుగు సినిమాను కూడా ఈ లిస్టులో మెన్షన్ చేయలేదు. ఈ సంవత్సరం, ఆస్కార్ అవార్డులకు భారతదేశం యొక్క అధికారిక ప్రవేశం ‘2018’ చిత్రంతో పాటు, మనోజ్ బాజ్పేయి రెండు చిత్రాలు ‘గుల్మోహర్’, ‘సిర్ఫ్ ఏక్ బందా కఫీ హై’ పనోరమా విభాగంలో చేర్చబడ్డాయి. దీంతో పాటు దర్శకుడు రాకేష్ చతుర్వేది ఓం రూపొందించిన ‘మండలి’ సినిమా కూడా ఇండియన్ పనోరమకు ఎంపికైంది. ఆసక్తికరమైన విషయం ఏంటంటే.. ఈ సినిమా ట్రైలర్కి సెన్సార్ సర్టిఫికేట్ ఇవ్వాలని ముంబై సెన్సార్ బోర్డ్ కార్యాలయం గత రెండు వారాలుగా రాకేష్ని ఇబ్బంది పెడుతోంది. దీని కోసం తనను రిసెప్షన్లో గంటల తరబడి కూర్చోబెట్టి అవమానించారని రాకేశ్ తెలిపారు. ఇక ఇండియన్ పనోరమా విభాగంలో ఎంపికైన ఈ 45 చిత్రాలు నవంబర్ 20 నుంచి 28 వరకు గోవా ఫిల్మ్ ఫెస్టివల్లో ప్రదర్శించబడతాయి. 12 మంది నిపుణులతో కూడిన జ్యూరీ ఈ సినిమాలను ఎంపిక చేసింది. జ్యూరీ ఫీచర్ ఫిల్మ్స్ కేటగిరీ కోసం మొత్తం 408 చిత్రాల నుండి దరఖాస్తులను స్వీకరించగా, వాటిలో 25 చిత్రాలు ఎంపిక చేయబడ్డాయి.
తాజావార్తలు
-
NTV Comment : కంటెంట్ బాగుంటే ఏ సినిమాని ఎవ్వరూ ఆపలేరు బాస్!
-
OTR : చంద్రగిరి కూటమి పార్టీల ముఖ్యుల మధ్య విభేదాలు
-
Story Board: ఆర్థిక ఊబిలో తెలుగు రాష్ట్రాలు
-
Central Govt: అడ్వాన్స్ టిప్ విధానాన్ని ఆపేయండి.. క్యాబ్ కంపెనీలకు కేంద్రం ఆదేశాలు
-
UPI Charges: ‘‘యూపీఐ ఛార్జీలు రద్దు చేయాలి’’.. సుప్రీంకోర్టులో పిటిషన్..
ట్రెండింగ్
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!
-
రూ.15,999కే 7,000mAh బ్యాటరీ, 2TB వరకు స్టోరేజ్ సపోర్ట్, 120Hz డిస్ప్లేతో OPPO K14 Lite లాంచ్.!
-
IPL 2027 Auction: బీసీసీఐ కీలక నిర్ణయం.. భారత్లోనే ఐపీఎల్ 2027 వేలం!
-
Sanju Samson vs Vaibhav: వైభవ్ సూర్యవంశీతో పోటీ.. సంజు శాంసన్ సంచలన వ్యాఖ్యలు!
-
Nitish Kumar Reddy: నా టార్గెట్ అదే.. అందుకోసమే కష్టపడుతున్నా!