ఇవాళ యంగ్ హీరో తనీష్ పుట్టినరోజు. ఈ సందర్భంగా ఆయన కొత్త చిత్రం ‘మరో ప్రస్థానం’ టీమ్ పుట్టినరోజు వేడుకలు నిర్వహించింది. సినిమా కార్యాలయంలో యూనిట్ సభ్యుల సమక్షంలో హీరో తనీష్ కేక్ కట్ చేశారు. తనీష్ కు దర్శకుడు జాని, ఇతర చిత్ర బృందం బర్త్ డే విషెస్ తెలిపి కేక్ తినిపించారు. ‘మరో ప్రస్థానం’ చిత్రంతో పాటు తనీష్ రాబోయే సినిమాలు కూడా మంచి విజయం సాధించాలనే ఆకాంక్షను వ్యక్తం చేశారు. అలానే తనీష్ బర్త్ డే ను పురస్కరించుకుని ఈ చిత్ర బృందం స్పెషల్ పోస్టర్ ను రిలీజ్ చేసింది. ఇంటెన్స్ యాక్షన్ థ్రిల్లర్ గా తెరకెక్కిన ‘మరో ప్రస్థానం’ అతి త్వరలో విడుదల కానుంది. ఇందులో ఎమోషనల్ కిల్లర్ పాత్రలో నటించారు తనీష్. హిమాలయ స్టూడియో మాన్షన్స్, ఉదయ్ కిరణ్ సమర్పణలో మిర్త్ మీడియా సంస్థ నిర్మించిన ఈ చిత్రానికి జాని దర్శకత్వం వహించారు. ముస్కాన్ సేథీ, భానుశ్రీ మెహ్రా, కబీర్ దుహాన్ సింగ్, రాజా రవీంద్ర ఇతర కీలక పాత్రల్లో కనిపించనున్నారు.

Puttinarojuna devudi aaseesulu dorakatamkante inkem kavalabba🙏🏼🥺❤️
— Tanish Alladi (@IAmTanishAlladi) September 7, 2021
Tirupathi lo Venkateswara swamini darsinchukunnappudu elanti feeling vasthundho Nenu @KChiruTweets garini ni direct ga kalisina prathi sari same emotional state lo untanu. That warmth and that aura 🙏🏼🤩😍 pic.twitter.com/cBaf8qpAuK