NTV Telugu Site icon

Actor Kidnap: మిస్సింగ్ కాదు కిడ్నాప్.. సీసీటీవీ ఫుటేజీతో పోలీసులు ట్విస్ట్!

Sodhi Kidnap Case

Sodhi Kidnap Case

Gurucharan Singh Kidnap Case Filed: ప్రముఖ టీవీ సీరియల్ ‘తారక్ మెహతా కా ఊల్తా చష్మా’లో సోధి పాత్ర పోషించిన గురు చరణ్ సింగ్ చాలా రోజులుగా కనిపించకుండా పోయారు. నటుడి తండ్రి ఈ మేరకు ఢిల్లీ పోలీసులకు ఫిర్యాదు చేశారు. ఇక అందుతున్న నివేదికల ప్రకారం, గురు చరణ్ సింగ్ ఏప్రిల్ 22న ముంబైకి వెళ్లేందుకు వచ్చి ఢిల్లీ ఎయిర్‌పోర్ట్‌లోని సీసీటీవీ ఫుటేజీలో కనిపించాడని సన్నిహితులు చెప్పారు. ఆ ఫుటేజీ కాకుండా మరేదైనా ఫుటేజీ ఉందా, చివరిసారిగా ఎవరికి ఫోన్ చేశాడు, వారి ఫోన్ నంబర్‌పై ఆరా తీస్తున్నారు. ఇక సీసీ టీవీ ఫుటేజ్ పరిశీలించిన పోలీసులు గురుచరణ్ సింగ్ కిడ్నాప్ అయి ఉండవచ్చని తేల్చారు. దీంతో నటుడు గురుచరణ్ సింగ్‌ గురించి ఢిల్లీ పోలీసులు కిడ్నాప్ కేసు నమోదు చేశారు. సీసీటీవీ ఫుటేజీ ఆధారంగా పోలీసులు ఈ పని చేశారు.

YSRCP: టీడీపీకి బిగ్ షాక్‌.. సీఎం జగన్‌ సమక్షంలో వైసీపీలో చేరిన సీనియర్ నేత

ఇది మాత్రమే కాదు, గురుచరణ్ సింగ్ ఫోన్‌లో కొన్ని లావాదేవీలను కూడా పోలీసులు వింతగా గుర్తించారు. ఐపీసీ సెక్షన్ 365 కింద పోలీసులు ఎఫ్ఐఆర్ కూడా నమోదు చేశారు. 50 ఏళ్ల నటుడు గురుచరణ్ సింగ్ దాదాపు 5 రోజులు కనిపించకుండా పోయారని, అతని తండ్రి ఢిల్లీలోని పాలెం పోలీస్ స్టేషన్‌లో ఫిర్యాదు చేయడంతో ఈ విషయం వెలుగులోకి వచ్చింది. నివేదికల ప్రకారం, గురుచరణ్ సింగ్ కుటుంబ సభ్యులను విచారించగా, గురుచరణ్ కి గత కొన్ని రోజులుగా బాగా లేదని చెప్పారు. అయితే, అతని మానసిక ఆరోగ్యం బాగానే ఉందని, గురుచరణ్ సింగ్ క్షేమంగా తిరిగి వస్తాడని కుటుంబ సభ్యులు ఆశాభావం వ్యక్తం చేస్తున్నారు. ‘తారక్ మెహతా…’ టీమ్‌తో కూడా పోలీసులు మాట్లాడినట్లు చెబుతున్నారు. అదే సమయంలో, అభిమానులు కూడా సోషల్ మీడియాలో గురుచరణ్ సింగ్ గురించి తమ ఆందోళనలను నిరంతరం వ్యక్తం చేస్తున్నారు.