ఏపీ టికెట్ ధరలపై నిర్మాత సి కళ్యాణ్ సంచలన వ్యాఖ్యలు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
సీనియర్ నిర్మాత సి కళ్యాణ్ నిన్న మీడియాతో ముచ్చటించారు. ఆంధ్రప్రదేశ్లో కొనసాగుతున్న టిక్కెట్ ధరల సమస్యపై ఆయన కొన్ని విమర్శనాత్మక వ్యాఖ్యలు చేశారు. ‘‘జగన్గారు పరిశ్రమకు సాయం చేసేలా చర్యలు తీసుకోవాలి. ఇది తీవ్రమైన సమస్య. ఇప్పుడున్న టిక్కెట్ ధరల సమస్యపై ఏపీ ప్రభుత్వం పునరాలోచించాలి. అఖండ పూర్తిగా బాలకృష్ణ స్టామినా. వైఎస్ఆర్ హయాంలో చిరంజీవి సినిమాకు ఇలాంటి సమస్య వచ్చింది. ప్రజల నుంచి చెడ్డపేరు వస్తుందని అధికారులు హెచ్చరించినా ఆయన టిక్కెట్ ధరలకు అనుమతి ఇచ్చారు. ఇండస్ట్రీకి దాసరి లాంటి ఇన్ఫ్లుయెన్షియల్ ఫిగర్ లేదు. ఆన్లైన్ టికెటింగ్ మాకు సహాయం చేస్తుంది కానీ ఈ ధరలు చాలా కష్టం. ఎన్టీఆర్ నుంచి వైఎస్ఆర్తో సహా ప్రతి సీఎం టాలీవుడ్కు అనుకూలులే. కానీ ఇటీవలి కాలంలో కొంత గ్యాప్ వచ్చింది” అని చెప్పారు. లని అన్నారు. పారదర్శకతను కొనసాగించడానికి ఆన్లైన్ టికెటింగ్ విధానాన్ని ప్రవేశపెట్టాలని నిర్మాతలు ప్రభుత్వాన్ని కోరారని, అయితే సోషల్ మీడియా మొత్తం అంశాన్ని వక్రీకరించిందని కళ్యాణ్ అన్నారు.
Read also : అనుష్పల పెళ్లిలో చరణ్, ఉపాసన రాయల్ లుక్… ఫోటోలు వైరల్
Also Read
“అఖండ” విజయం గురించి ప్రముఖ నిర్మాత మాట్లాడుతూ, ప్రేక్షకులు ఏ గోలతో సంబంధం లేకుండా థియేటర్లకు వెళ్లి సినిమాలను ఆస్వాదిస్తారని ఈ చిత్రం రుజువు చేసిందని అన్నారు. తన రాబోయే ప్రాజెక్ట్ల గురించి మీడియా ప్రశ్నించగా బాలయ్య డ్రీమ్ ప్రాజెక్ట్ ‘శంకరాచార్య’ని నిర్మించాలని ఆలోచిస్తున్నానని, ఆయన నుంచి గ్రీన్ సిగ్నల్ కోసం వేచి చూస్తున్నానని కళ్యాణ్ వెల్లడించాడు. సత్యదేవ్, గాడ్సే దర్శకుడు గోపీ గణేష్లతో సినిమాలు తెరకెక్కుతున్నాయని నిర్మాత తెలిపారు.
సత్యదేవ్ నటించిన తన తదుపరి చిత్రం ‘గాడ్సే’ 26 జనవరి 2022న విడుదలవుతుందని అతను చెప్పాడు. అంతేకాకుండా సి కళ్యాణ్ రానా దగ్గుబాటితో 1945 అతి త్వరలో విడుదల కానుందని వెల్లడించారు.
తాజావార్తలు
-
AP Weather Alert : ఏపీలో నిప్పుల కుంపటి.. 8 జిల్లాలకు ‘రెడ్ అలర్ట్’ జారీ!.
-
Mega Family : మెగా ఫ్యామిలీకి DSP దూరం ?
-
Kamal Haasan: కమల్హాసన్ సంచలన నిర్ణయం.. మోడీకి మద్దతు తెల్పుతూ వీడియో విడుదల
-
POCSO Case : బ్లాక్మెయిల్ నుంచి పోక్సో కేసు వరకు.. తిరుపతిలో కలకలం రేపిన ఘటన.!
-
Prashanth Neel: ప్రశాంత్ నీల్ ‘డ్రాగన్ 2’ మాస్టర్ ప్లాన్ లీక్!
ట్రెండింగ్
-
Cockroach Janata Party: సోషల్ మీడియాను షేక్ చేస్తున్న “కాక్రోచ్ జనతా పార్టీ”.. కేవలం 72 గంటల్లోనే 20 లక్షల ఫాలోవర్స్!
-
55dB ANC, 53 గంటల బ్యాటరీతో Moto Buds 2 లాంచ్.. ధర కూడా తక్కవే.!
-
Explained: పెట్రోల్ వాత, డాలర్ మోత.. ఆసియాలోనే అత్యంత వీక్ కరెన్సీగా ‘Rupee’.. పతనానికి అసలు కారణం ఇదే..
-
144Hz OLED డిస్ప్లే, 8000mAh బ్యాటరీతో వచ్చేస్తున్న గేమింగ్ మాన్స్టర్ Lenovo Legion Y70 (2026)..!
-
Healthy Ragi Kudumulu: రక్త హీనతను తొలగించి ఎముకలను దృఢంగా చేసే ‘రాగి కుడుములు’ చేసేయండి ఇలా..!