టాలీవుడ్ క్రేజీ కాంబినేషన్ లలో పవన్ కళ్యాణ్ మరియు బోయపాటి శ్రీను కాంబినేషన్ ఒకటి.. వీరిద్దరి కాంబోలో ఒక చిత్రం రావాలని ఫ్యాన్స్ కూడా ఎంతగానో కోరుకున్నారు.పవన్ కళ్యాణ్ ని అప్పట్లో అభిమానులు పక్కా ఊర మాస్ సినిమా లో చూడాలని అనుకున్నారు..సరిగ్గా ఆ సమయం లోనే ‘గబ్బర్ సింగ్’వంటి బ్లాక్ బస్టర్ హిట్ చిత్రం వచ్చింది. అప్పటి వరకు ఉన్న ఇండస్ట్రీ రికార్డ్స్ అన్ని కూడా ఈ చిత్రం బద్దలు కొట్టి ఆల్ టైం బిగ్గెస్ట్ ఇండస్ట్రీ హిట్ గా నిల్చింది. ఈ సినిమా తర్వాత పవన్ కళ్యాణ్ వెంటనే డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ లో ఒక సినిమా చేసేందుకు అడ్వాన్స్ తీసుకున్నట్లు సమాచారం.అదే సమయం లో బోయపాటి శ్రీను వద్ద ఒక మంచి స్క్రిప్ట్ ఉందని తెలిసి డీవీవీ దానయ్య ఎంటర్టైన్మెంట్స్ సంస్థ బోయపాటి శ్రీను ని పిలిపించి ఆ కథని పవన్ కళ్యాణ్ తో చేయించడానికి ఏర్పాట్లు చేసారని సమాచారం.
బోయపాటి పవన్ కళ్యాణ్ ని కలిసి కథ ను కూడా వినిపించాడు, కానీ పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా ఆ కథ లేదని, కొన్ని మార్పులు చేర్పులు చేసి తీసుకొని రమ్మన్నాడని సమాచారం.బోయపాటి శ్రీను కూడా అలాగే అని చెప్పి పవన్ కళ్యాణ్ బాడీ లాంగ్వేజ్ కి తగ్గట్టుగా కథలో కొన్ని మార్పులు చేసి మరోసారి పవన్ కళ్యాణ్ కు కధ వినిపించాడు.కానీ ఎందుకో పవన్ కళ్యాణ్ ఆ ఓవర్ మాస్ కథ పవన్ కి నచ్చలేదు.తన నిర్ణయం తరువాత చెప్తాను అని బోయపాటికి తెలియజేసాడు పవన్.ఆ సమయం లోనే పూరి జగన్నాథ్ ‘కెమెరా మ్యాన్ గంగతో రాంబాబు’ స్టోరీ కి పవన్ ఓకే చెప్పాడు..ఈ సినిమా సెట్స్ మీదకి వెళ్లే ముందు పవన్ కళ్యాణ్ బోయపాటి శ్రీను కి ఫోన్ చేసి, మీరు నాకు చెప్పిన కథ నాకు చాలా నచ్చింది కానీ, ఎందుకో అలాంటి కథ నాకు సెట్ అవ్వదు అనిపిస్తుంది. ఈ కథ బాలయ్యగారికి అయితే బాగా సరిపోతుంది అని చెప్పి నాకు తగ్గ కథని ని రాయండి మీ దర్శకత్వం లో సినిమా చెయ్యాలని నాకు కూడా ఉంది అని బోయపాటి కి చెప్పాడట పవన్.కానీ వీరిద్దరి కాంబినేషన్ ఇప్పటికీ కూడా సెట్ అవ్వలేదు.
