RRR : ట్రిపుల్ ఆర్’ అర్ధశతదినోత్సవం!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దర్శకధీర రాజమౌళి దర్శకత్వంలో యంగ్ టైగర్ యన్టీఆర్, మెగాపవర్ స్టార్ రామ్ చరణ్ కలసి నటించిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం మే 13తో యాభై రోజులు పూర్తి చేసుకుంది. తొలి నుంచీ భారీ అంచనాలతో అందరినీ ఊరిస్తూ వచ్చిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం మార్చి 25న జనం ముందు నిలచింది. మొదటి నుంచీ ఈ సినిమాకు ఉన్న క్రేజ్ తో ఈ యేడాది తెలుగులో భారీ వసూళ్లు చూసిన చిత్రంగా నిలచింది ‘ట్రిపుల్ ఆర్’. హైదరాబాద్ ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో ‘ట్రిపుల్ ఆర్’ సినిమా ఐదు కోట్ల రూపాయలు పోగేసి సరికొత్త రికార్డ్ సృష్టించింది. ఈ నేపథ్యంలో హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో ఈ చిత్రం అర్ధశతదినోత్సవం జరుపుకుంది. ఈ చిత్రం విడుదలయ్యాక కొన్ని భారీ చిత్రాలు రావడంతో సినిమాను కొన్ని కేంద్రాలలో షిఫ్ట్ చేయవలసి వచ్చింది. 48 రోజుల వరకు ఈ చిత్రం తెలుగునేలపై 24 కేంద్రాలలో డైరెక్ట్ గా ప్రదర్శితమయింది. మే 12న మహేశ్ బాబు ‘సర్కారువారి పాట’ విడుదల కావడంతో అనేక కేంద్రాల్లో ‘ట్రపుల్ ఆర్’ను తీసివేశారు. దాంతో కేవలం 8 కేంద్రాలలోనే ‘ట్రిపుల్ ఆర్’ డైరెక్ట్ గా యాభై రోజులు సాగింది.
హైదరాబాద్ సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో కూడా 48 రోజులకు షిఫ్ట్ చేసే ప్రయత్నం జరిగింది. ఎందుకంటే ‘సర్కారు వారి పాట’ చిత్రం పర్మినెంట్ థియేటర్ గా ముందు సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.నే ఎంచుకున్నారు. అయితే ఆర్టీసీ క్రాస్ రోడ్స్ లో రికార్డ్ స్థాయి కలెక్షన్స్ చూసిన ‘ట్రిపుల్ ఆర్’ చిత్రం నైజామ్ లో కనీసం యాభై రోజులు నేరుగా ఆడలేదంటే బాగోదని ఫ్యాన్స్ భావించారు. వారి అభిప్రాయాన్ని పంపిణీదారులు, థియేటర్ వారు సైతం గౌరవించారు. అందువల్ల మే 12న సుదర్శన్ 35 ఎమ్.ఎమ్.లో ‘సర్కారు వారి పాట’ను కేవలం రెండు ఆటలకే పరిమితం చేసి, ‘ట్రిపుల్ ఆర్’ను మూడు ఆటలు ప్రదర్శించారు. అలా ఆ థియేటర్ లో 48 రోజులు 4 ఆటలతో సాగిన ‘ట్రపుల్ ఆర్’ రెండు రోజులు మూడు ఆటలతో నడిచింది. ముందుగా చేసుకున్న ఒప్పందం ప్రకారం ‘ట్రిపుల్ ఆర్’ను 51వ రోజు నుంచీ క్రాస్ రోడ్స్ లోని సంధ్య 70 ఎమ్.ఎమ్.లో ప్రదర్శించనున్నారు. ఇతర కేంద్రాలలో పరిస్థితి కూడా దాదాపు ఇలాగే ఉంది. ప్యాండమిక్ తరువాత హైదరాబాద్ లో అదీ సుదర్శన్ 35 ఎమ్.ఎమ్. లోనే డైరెక్ట్ గా యాభై రోజులు ఆడిన తొలి చిత్రంగా బాలకృష్ణ ‘అఖండ’ నిలచింది. ఆ సినిమా 54 రోజులు 4 ఆటలతో అర్ధశతదినోత్సవం చూసింది. ఇప్పుడు ‘ట్రిపుల్ ఆర్’ ఆ బాటలోనే సాగింది. ‘అఖండ’ 50వ రోజున డైరెక్ట్ గా 24 కేంద్రాలలో ప్రదర్శతమయింది. ఆ రోజున మొత్తం 160కి పైగా స్క్రీన్స్ లో సందడి చేసింది. 8 కేంద్రాలలో డైరెక్ట్ గా అర్ధశతదినోత్సవం చూసిన ‘ట్రిపుల్ ఆర్’ ప్రపంచ వ్యాప్తంగా 50వ రోజున 200పైగా స్క్రీన్స్ లో ప్రదర్శితమయింది.
Also Read
- Killer Movie Accident: ఎస్.జె.సూర్య 'కిల్లర్' సెట్స్లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
- 4 Years of Vikram: లోకనాయకుడి 'విక్రమ్' కి నాలుగేళ్లు.. నేటికీ చెక్కు చెదరని ఎల్సీయూ (LCU) రికార్డ్స్!
- Ntv Exclusive: 'పెద్ది'తో రామ్ చరణ్ విశ్వరూపం.. కంటతడి పెట్టించేశాడట!
- PEDDI Hikes : పెద్ది తెలంగాణ టికెట్ ధరల పెంపు.. జీవో వెనుక చక్రం తిప్పిన టాలీవుడ్ బడా నిర్మాత
తాజావార్తలు
-
T20 World Cup: కేవలం భారత్, పాకిస్థాన్ మ్యాచ్కే హైప్ తెస్తారా.. సంచలన వ్యాఖ్యలు చేసిన స్మృతి మంధాన..
-
Monsoon: అన్నదాతలకు శుభవార్త.. 24 గంటల్లో కేరళను ముద్దాడనున్న తొలకరి వాన
-
Killer Movie Accident: ఎస్.జె.సూర్య ‘కిల్లర్’ సెట్స్లో సిలిండర్ బ్లాస్ట్.. ఒకరు మృతి, ముగ్గురి పరిస్థితి విషమం!
-
CM Chandrababu: తెలంగాణలో పవన్ కల్యాణ్ సభకు అడ్డంకులపై స్పందించిన చంద్రబాబు.. ఆసక్తికర వ్యాఖ్యలు..
-
Annamalai: అన్నామలై రాజీనామా చేయలేదా..?
ట్రెండింగ్
-
Motorola Edge 2026 లాంచ్.. 6.3 అంగుళాల 1.5K AMOLED డిస్ప్లే, Dimensity 7450 చిప్తో.!
-
Pest Control : చెదల బెడదకు చెక్.. ఇంట్లోనే ఈ చిట్కాలు ట్రై చేయండి.!
-
Traditional Desserts : జీర్ణక్రియకు మేలు చేసే బూడిద గుమ్మడికాయ ‘హల్వా’.. సింపుల్ గా ఇలా చేసుకొండి.!
-
Neredu Jam : పిల్లలకు నేరేడు పండ్లు తినిపించే సీక్రెట్ ఇదే.! ఈ విధంగా జామ్ చేస్తే ప్లేట్ ఖాళీ..!
-
Mamidikaya Pappucharu: ‘మామిడికాయ పప్పుచారు’ ఇలా చేయండి.. దీని ముందు స్టార్ హోటల్ వంటలూ దిగదుడుపే.!