Site icon NTV Telugu

కరోనా వచ్చింది ఫ్రెండ్స్ అంటూ ఛిల్ల్ అవుతూ చెప్పిన డైరెక్టర్ కమ్ నటుడు

tarun bhaskar

tarun bhaskar

చిత్ర పరిశ్రమను కరోనా పట్టిపీడిస్తోంది. సెలబ్రిటీలు ఒకరి తరువాత ఒకరు కరోనా బారిన పడుతున్నారు. ఇప్పటికే పలువురు ప్రముఖులు కరోనాతో ఐసోలేషన్ లో ఉన్న సంగతి తెలిసిందే. ఇక తాజాగా రోలీవుడ్ డైరెక్టర్ తరుణ్ భాస్కర్ కరోనా బారిన పడ్డారు. ఈ విషయాన్ని ఆయన సోషల్ మీడియా ద్వారా అభిమానులకు తెలిపారు. `హలో ఫ్రెండ్స్ కోవిడ్ వచ్చింది. ఇంట్లోవిశ్రాంతి తీసుకుంటున్నాను ఫ్రెండ్స్. ఆ మామను అందరూ సీరియస్ గా తీసుకోవాలి ఫ్రెండ్స్” అంటూ తనదైన రీతిలో చెప్పుకొచ్చాడు. పెళ్లి చూపులు చిత్రంతో డైరెక్టర్ గా పరిచయమైన తరుణ్ , ‘ఈ నగరానికి ఏమైంది’ చిత్రంతో టాలీవుడ్ స్టార్ డైరెక్టర్లలో ఒకడిగా మారిపోయాడు. ఇక ‘మీకు మాత్రమే చెప్తా’ చిత్రంతో తరుణ్ హీరోగా మారాడు. ఈ సివినిమను రౌడీ హీరో విజయ్ దేవరకొండ నిర్మించాడు. ప్రస్తుతం తరుణ్, విక్టరీ వెంకటేష్ కోసం కథను సిద్ధం చేయడంలో బిజీగా ఉన్నాడు. త్వరలోనే ఈ సినిమా పట్టాలెక్కబోతుంది.

Exit mobile version