బాక్సాఫీస్ వద్ద ‘ధురంధర్ 2’ ప్రభంజనం సృష్టిస్తోంది, రికార్డులను తిరగరాస్తూ కాసుల వర్షం కురిపిస్తున్న ఈ సినిమాపై సర్వత్రా ప్రశంసలు వ్యక్తమవుతున్నాయి. ఈ క్రమంలో కీలక పాత్ర పోషించిన సీనియర్ నటుడు రాకేశ్ బేడీ ప్రేక్షకులకు ఒక ముఖ్యమైన విన్నపం చేశారు, “సినిమా చూసిన వారు సోషల్ మీడియాలో స్పియిలర్లు షేర్ చేయవద్ద”ని ఆయన కోరారు. గతంలో ‘ధురంధర్: ది రివెంజ్’ చిత్రంలో జమీల్ జమాలీ పాత్రతో మెప్పించిన రాకేశ్ బేడీ, సీక్వెల్ విజయం పట్ల ఆనందం వ్యక్తం చేశారు. ఈ సందర్భంగా ఇన్ స్టాగ్రామ్ వేదికగా ఒక వీడియో విడుదల చేస్తూ.. “ధురంధర్ 2 బాక్సాఫీస్ రికార్డులను ముక్కలు చేసింది, ప్రపంచవ్యాప్తంగా ప్రేక్షకుల మనసు గెలుచుకుంది. ఇది కేవలం కమర్షియల్ హిట్ మాత్రమే కాదు, సామాన్య ప్రజలపై కూడా గట్టి ప్రభావం చూపుతోంది” అని అన్నారు.
Also Read:Tollywood Events: అంత జరిగినా అదే నిర్లక్ష్యమా ?
అయితే, థియేటర్లలో సినిమా చూస్తున్న సమయంలో ఫోన్లతో సీన్లు షూట్ చేసి సోషల్ మీడియాలో పెట్టవద్దని ఆయన నెటిజన్లను కోరారు, ముఖ్యంగా సినిమాలోని క్లైమాక్స్ లేదా చివరి సన్నివేశాలను లీక్ చేయడం ‘స్పాయిల్ స్పోర్ట్’ అవుతుందని, మీరు సినిమా చూసి ఎంజాయ్ చేశారు కదా, అలాగే మిగిలిన వారు కూడా ఆ అనుభూతిని పొందేలా సహకరించాలని ఆయన విజ్ఞప్తి చేశారు. రాకేశ్ బేడీ కంటే ముందే దర్శకుడు ఆదిత్య ధర్ కూడా ప్రేక్షకులను ఇదే విషయంపై కోరారు. “ప్రతి అభిమాని ఏమీ తెలియకుండానే థియేటర్లోకి అడుగుపెట్టాలి, సినిమా చూశాక ఒక వ్యక్తిగత అనుభూతితో బయటకు రావాలి. అందుకే దయచేసి కథలోని మలుపులను బయట పెట్టకండి” అని ఆయన సోషల్ మీడియాలో పేర్కొన్నారు.