కంగనాపై సిక్కు కమ్యూనిటీ ఫైర్… కేసు నమోదు
- Follow Us :
-
-
Add as a preferred
source on google
దేశ స్వాతంత్ర్యంపై కంగనా రనౌత్ ఇచ్చిన వివాదాస్పద ప్రకటన వ్యవహారం ఇంకా కొనసాగుతూనే ఉంది. కంగనా ప్రకటనపై ఇంకా విమర్శలు కొనసాగుతున్నాయి. అదే సమయంలో మూడు వ్యవసాయ చట్టాలను ఉపసంహరించుకున్న తర్వాత కంగనా కేంద్రంపై ఫైర్ అవుతూ సోషల్ మీడియాలో సిగ్గుచేటు అంటూ పోస్ట్ చేసింది. ఈ కారణంగా కంగనాపై మరో పోలీసు ఫిర్యాదు దాఖలైంది.
Read Also : ఐదు భాషల్లో “పుష్ప” డిస్ట్రిబ్యూటర్స్ కన్ఫర్మ్
Also Read
ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ కంగనాపై పోలీసులకు ఫిర్యాదు చేసింది. ఇన్స్టాగ్రామ్లో సిక్కు కమ్యూనిటీపై అభ్యంతరకర వ్యాఖ్యలు చేశారంటూ వారు ఆరోపించారు. కమిటీ విడుదల చేసిన ప్రకటన ప్రకారం మందిర్ మార్గ్ పోలీస్ స్టేషన్లోని సైబర్ సెల్లో కంగనాపై ఈ ఫిర్యాదు నమోదైంది. కంగనా మొదట ఉద్దేశపూర్వకంగా రైతు ఉద్యమాన్ని ఖలిస్తానీ ఉద్యమంగా అభివర్ణించిందని, ఆ తర్వాత ఆమె సిక్కు సమాజంపై అభ్యంతరకరమైన, అవమానకరమైన పదజాలాన్ని ఉపయోగించిందని కమిటీ వ్యక్తులు అంటున్నారు. “సిక్కు సమాజం మనోభావాలను దెబ్బ తీసేందుకు ఉద్దేశపూర్వకంగా ఆమె ఆ పోస్ట్ చేసింది. నేరపూరిత ఉద్దేశ్యంతో షేర్ చేశారు. కాబట్టి ఈ ఫిర్యాదును పరిగణలోకి తీసుకోవాలని, ఎఫ్ఐఆర్ నమోదు చేసిన తర్వాత కఠినమైన చట్టపరమైన చర్యలు తీసుకోవాలని మేము అభ్యర్థిస్తున్నాము” అనేది ఢిల్లీ సిక్కు గురుద్వారా మేనేజ్మెంట్ కమిటీ ఫిర్యాదులో ఉందని తెలుస్తోంది.
తాజావార్తలు
ట్రెండింగ్
-
Abishek Porel Arrest: అత్యాచారం, బెదిరింపులు.. ఐపీఎల్ స్టార్ అరెస్ట్!
-
Gold Rate Today: బంగారం, వెండి ధరలకు రెక్కలు.. ఏకంగా రూ.10 వేలు!
-
Tulsi Plant Care Tips: వర్షాకాలంలో తులసి మొక్క గుబురుగా, పచ్చగా పెరగాలా.. సింపుల్గా ఈ చిట్కాలను ఫాలో అవ్వండి చాలు.!
-
Virat Kohli Bowler: బెస్ట్ బౌలర్గా విరాట్ కోహ్లీ.. షాక్ అవుతున్న క్రికెట్ ఫాన్స్!
-
YouTube Monetization Rules 2027: కొత్త యూట్యూబర్లకు బిగ్ షాక్.. మోనిటైజేషన్ నిబంధనలను రెట్టింపు చేసిన యూట్యూబ్..