యూత్ ను టార్గెట్ చేసే స్టోరీస్ సెలక్ట్ చేసుకుంటూ సపరేట్ ఐడెంటిటీ క్రియేట్ చేసుకుంటున్నాడు జీవా. మాస్క్, వాలంటీర్, తీయ్’,’గర్జన’ అఘతియా ఆ కోవలోని సినిమాలే. అయితే లాస్ట్ ఇయర్ అక్టోబర్ లో ప్రేక్షకుల ముందుకు వచ్చిన బ్లాక్ సైన్స్ ఫిక్షన్ హారర్ థ్రిల్లర్గా యూత్ అంచనాలకు చేరువైంది. తమిళ దర్శకుడు కే.జీ సుబ్రమణి దర్శకత్వం వహించిన ఈ సినిమా గ్రాండ్ సక్సెస్ అయింది. అయితే ఆ తర్వాత జీవ నటించిన అగస్త్య పై ఎన్నో ఆశలు పెట్టుకోగా భారీ డిజాస్టర్ గా మిగిలింది. దాంతో మరోసారి తనకు హిట్ ఇచ్చిన డైరెక్టర్ నే నమ్ముకున్నాడు జీవా.
Also Read : Anushka : ఘాటీ.. న్యూ రిలీజ్ డేట్ ఫిక్స్.?
బ్లాక్ తో హిట్ ఇచ్చిన దర్శకుడు కే.జీ సుబ్రమణితో మరో సినిమాకు శ్రీకారం చుట్టాడు. రంగం, రంగం 2 సినిమాలతో తెలుగు ప్రేక్షకులు దగ్గరైన జీవా కెరీర్ లో 46వ సినిమాగా రాబోతున్న ఈ సినిమాను నటుడు విశాల్ అండ్ జీవా ఫాదర్ ఆర్ బి చౌదరి సమక్షంలో అనౌన్స్ చేశారు. జీవాతో పాటు ఈసినిమాలో బబ్లూ పృథ్విరాజ్ కూడా కనిపించనున్నారు. గతంలో జీవా రావణకొట్టం మూవీ ప్రొడ్యూసర్ గా చేసిన రవి కన్నన్, కన్నన్ రవి గ్రూప్ బ్యానర్ పై జీవా 46వ సినిమాను నిర్మిస్తున్నారు. తమిళ భాషలో రిలీజ్ అయ్యి బ్లాక్ బస్టర్ అయిన బ్లాక్ మూవీని డార్క్ పేరుతో తెలుగులోకి తీసుకొచ్చారు మేకర్స్. ప్రస్తుతం ఓటిటిలో అందుబాటులో ఉంది డార్క్. విభిన్న కథాంశంతో భారీ నిర్మాణ విలువలతో యూత్ ని టార్గెట్ చేస్తూ మరోసారి కే.జి సుబ్రమణి డైరెక్షన్ లో ప్రముఖ సినిమాటోగ్రాఫర్ గా గోకుల్ బినాయ్ ని జీవా 46వ సినిమా చేస్తున్నాడు. మరి ఈ ప్రాజెక్ట్ ఎలాంటి సక్సెస్ ను అందుకుంటుందో చూడాలి.