NTV Telugu Site icon

TamilNadu BSP : స్టార్ దర్శకుడి మెడకు చుట్టుకున్న కె.ఆర్మ్ స్ట్రాంగ్‌ హత్య..?

Untitled Design (10)

Untitled Design (10)

తమిళనాడు బాహుజన సమాజ్ పార్టీ చీఫ్ కె.ఆర్మ్ స్ట్రాంగ్‌ను కొంత మంది గుర్తు తెలియ‌ని వ్య‌క్త‌లు దారుణంగా చంపేశారు. అప్పట్లో హత్య వ్యవ్యహారం తమిళనాడు రాజకీయ వర్గాలలో తీవ్ర చర్చకు దారితీసింది. కుల అహంకార వ్యక్తులే ఈ హత్య చేసారని దళిత సంఘాలు ఆందోళన చెప్పట్టాయి. కె.ఆర్మ్ స్ట్రాంగ్‌ రాజకీయ నాయకుడు మాత్రమే కాదు ఆయన ఒక లాయ‌ర్ కూడా. తమిళనాడులో న్యాయవాదులకు రక్షణలేకుండా పోయిందని ధర్నాలు చేపట్టారు. దీంతో ఈ కేసు వ్యవహరాన్ని సీరియ‌స్‌గా తీసుకుని విచార‌ణ‌ చేపట్టారు పోలీసులు. విచారణలో భాగంగా కొంత మంది అనుమానితుల‌ను అరెస్ట్ చేసి జైలుకు తరలించారు.

Also Read: Pongal Release : 2025 సంక్రాంతి ఇప్పటికే హౌస్ ఫుల్.. రేస్ లోకి మరో స్టార్ హీరో..

అయితే ఈ అసలు నిందితుడు మొట్టై కృష్ణ‌న్ ను వదిలేసి వేరెవరినో అరెస్ట్ చేసారని విమర్శలు వచ్చాయి. ఈ నేపథ్యంలో పోలీసులు ఈ కేసును మరింత  లోతైన విచారణ చేపట్టారు. ఈ విచారణలో పోలీసులకు  విస్తుపోయే నిజాలు తెలిశాయి. హత్య కేసులో ప్రధాన నిందితుడైన మొట్టై కృష్ణ‌న్ విదేశాల‌కు పారిపోయాడ‌ని తెలుస్తోంది. మొట్టై కృష్ణ‌న్ విదేశాలకు పారిపోవ‌టానికి కొన్ని గంట‌ల ముందు మోనీషాతో ఫోన్‌లో మాట్లాడార‌ని, మోనిషా నిందితుడు మొట్టై కృష్ణ‌న్ కు ఆశ్ర‌యం ఇచ్చిందని పోలీసుల‌కు విచార‌ణ‌లో తెలిసింది. ఈ మోనిషా ఎవరోకాదు రజనీకాంత్ తో జైలర్ సినిమాను తెరకెక్కించిన దర్శకుడు నెల్సన్ దిలీప్ కుమార్ భార్య. దీంతో పోలీసులు నెల్స‌న్ స‌తీమ‌ణి మోనీషాను విచారించారు. మొట్టై కృష్ణ‌న్ కు మోనిషాకు సంబంధం ఏంటనే కోణంలో దర్యాప్తు చేపట్టారు. ఈ వార్తలపై నెల్సన్ టీమ్ నుండి ఎటువంటివివరణ రాలేదు. ప్రస్తుతం దర్యాపు స్టేజ్ లో ఉన్న ఈ కేసులో రానురాను ఎటువంటి నిజాలు భయటపడతాయో ముందు ముందు రోజుల్లో తెలుస్తుంది.