స్టార్ హీరోయిన్ సమంత (Samantha) లీడ్ రోల్లో నటిస్తూ స్వయంగా నిర్మిస్తున్న లేటెస్ట్ యాక్షన్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ‘మా ఇంటి బంగారం’ (Maa Inti Bangaram). ‘ఓ బేబీ’ లాంటి బ్లాక్బస్టర్ హిట్ తర్వాత సమంత – టాలెంటెడ్ లేడీ డైరెక్టర్ నందినీ రెడ్డి (Nandini Reddy) కాంబినేషన్లో వస్తున్న సినిమా కావడంతో దీనిపై ఇప్పటికే భారీ అంచనాలు ఉన్నాయి. తాజాగా విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ యూట్యూబ్లో రికార్డు వ్యూస్తో దూసుకుపోతోంది. ఈ నేపథ్యంలో హైదరాబాద్లో అత్యంత వైభవంగా జరిగిన ‘మా ఇంటి బంగారం’ ట్రైలర్ లాంచ్ ఈవెంట్లో సమంత, దర్శకురాలు నందినీ రెడ్డి, ఆమె భర్త రాజ్ పంచుకున్న ఆసక్తికరమైన విశేషాలు (Introduction) ఇక్కడ చూద్దాం.
‘మా కోసం ఇక్కడికి తరలివచ్చిన ప్రతి ఒక్క అభిమానికి నా హృదయపూర్వక ధన్యవాదాలు. మీ ప్రేమే నన్ను ముందుకు నడిపిస్తోంది. దర్శకురాలు నందినీ రెడ్డి, రాజ్ ప్రతి విషయంలోనూ పర్ఫెక్ట్గా ఉంటారు. వారితో పని చేయడం అద్భుతమైన అనుభూతి. ఇప్పటివరకు వారితో నాకు ఎలాంటి చిన్న వాదన గానీ, చేదు అనుభవం గానీ ఎదురవ్వలేదు. ఈ సినిమాలో ప్రతి ఒక్క ఎమోషన్ ఉంది. యాక్షన్, డ్రామా, కామెడీ కలగలిసిన ఒక కంప్లీట్ ఫ్యామిలీ ఎంటర్టైనర్ ఇది. దయచేసి అందరూ థియేటర్లలో చూసి ఎంజాయ్ చేయండి. సమంత అభిమానులంతా ఖచ్చితంగా గర్వపడేలా ఈ సినిమా ఉంటుంది’ అని సామ్ ధీమా వ్యక్తం చేశారు.
డైరెక్టర్ నందినీ రెడ్డి మాట్లాడుతూ.. ‘సమంత రోజురోజుకూ ఒక నటిగా ఎదుగుతూనే ఉంది. ఆమె గత సినిమాలకు, ఈ నాటి నటనకు మధ్య చాలా వ్యూజ్ డిఫరెన్స్ ఉంది. సమంత ఇప్పుడు నెక్స్ట్ లెవెల్కు చేరుకుంది. ఈ సినిమాలో యాక్షన్, కామెడీ, ఎమోషన్.. ఇలా ప్రతి సీన్లోనూ ఆమె అద్భుతంగా నటించింది. డైరెక్టర్గా కాకుండా, నేను కూడా ఒక ఫ్యాన్లా కళ్లప్పగించి ఆమె నటనను చూశాను. ఈ సినిమా అందరినీ అలరించే ఒక పెద్ద బ్లాస్ట్ అవుతుంది” అని చెప్పారు. సమంత భర్త రాజ్ మాట్లాడుతూ..‘ ‘మా ఇంటి బంగారం’ అనే టైటిల్ వినడానికి ఎంతో సాఫ్ట్గా, అనురాగం, ప్రేమతో కూడినదిగా అనిపిస్తుంది. కానీ, ఈ హోమ్లీ టైటిల్ వెనుక ఒక చీకటి కోణం, విపరీతమైన పగ దాగి ఉన్నాయి. సమంతకు, నందినికి మధ్య ఉన్న సాన్నిహిత్యం, బాండింగ్ అందరికీ తెలిసిందే. అందుకే ఈ కథకు నందినీ రెడ్డి అయితేనే పర్ఫెక్ట్ న్యాయం చేయగలదని మేము ఆమెను దర్శకురాలిగా ఎంపిక చేశాం’ అని వెల్లడించారు.
