సోషల్ మీడియాలో హోమ్లీ బ్యూటీ రుక్మిణి వసంత్ (Rukmini Vasanth) పేరిట వైరల్ అవుతున్న వివాదాస్పద బికినీ వీడియోపై ఎట్టకేలకే పూర్తి స్పష్టత వచ్చేసింది. స్విమ్మింగ్ పూల్ వద్ద వేరొకరు చేసిన ఒక బోల్డ్ ఫోటోషూట్కు సంబంధించిన వీడియో క్లిప్స్ను ఏఐ (AI) టెక్నాలజీ సాయంతో మార్ఫింగ్ చేసి, రుక్మిణి వసంత్ ముఖాన్ని దానికి అతికించి నెట్టింట వైరల్ చేశారు. దీనిపై అటు అభిమానుల్లో, ఇటు కన్నడ సినీ వర్గాల్లో తీవ్ర గందరగోళం నెలకొనడంతో రుక్మిణి స్వయంగా రంగంలోకి దిగి ఆ ఫోటోలు నావి కాదంటూ క్లారిటీ ఇచ్చారు. ఆ ఫొటోలు, వీడియో క్లిప్స్ అన్నీ వందకు వంద శాతం నకిలీవని (Fake), అవి ఏఐ డీప్ఫేక్ టెక్నాలజీతో సృష్టించినవని స్వయంగా రుక్మిణి వసంత్ స్పష్టం చేస్తూ తీవ్ర ఆగ్రహం వ్యక్తం చేశారు.
‘ఆన్లైన్లో నా పేరుతో వైరల్ అవుతున్న డీప్ఫేక్/AI ఫోటోలతో నాకు ఎలాంటి సంబంధం లేదు’ అని అవి ముమ్మాటికీ నకిలీవే అని.. ఈ ఫేక్ కంటెంట్ను క్రియేట్ చేసిన వారిపై.. దానిని సోషల్ మీడియాలో కావాలని షేర్ చేస్తూ వైరల్ చేస్తున్న వారిపై చట్టపరమైన చర్యలు తీసుకోవడానికి రుక్మిణి సిద్ధమయ్యారు. ఈ మేరకు ఆమె తన లీగల్ టీమ్ ద్వారా సైబర్ క్రైమ్ పోలీసులకు (Cyber Crime Police) అధికారికంగా ఫిర్యాదు చేయబోతున్నట్లు స్పష్టం చేశారు. గతంలో రష్మిక మందన్న, పూజా హెగ్డే వంటి స్టార్ హీరోయిన్లు కూడా ఇలాంటి ఏఐ డీప్ఫేక్ వీడియోల బారిన పడి సైబర్ పోలీసులను ఆశ్రయించిన సంగతి తెలిసిందే. ఇప్పుడు రుక్మిణి వసంత్ కూడా అదే తరహా సైబర్ వేధింపులను ఎదుర్కోవాల్సి రావడం దురదృష్టకరం. అయితే, ఆమె హోమ్లీ ఇమేజ్ను దెబ్బతీయడానికే ఎవరో కావాలని ఇలాంటి పాడుపని చేశారని, ఆమె తీసుకున్న లీగల్ యాక్షన్ నిర్ణయం కరెక్ట్ అని కన్నడ అభిమానులు రుక్మిణికి మద్దతుగా నిలుస్తున్నారు.
