Site icon NTV Telugu

Rishab Shetty: టాలీవుడ్‌‌లో మరో భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చిన రిషబ్‌శెట్టి..!

Rishab Shety

Rishab Shety

‘కాంతార’ సిరీస్‌తో దేశవ్యాప్తంగా సూపర్‌ స్టార్‌ రేంజ్‌లోకి వెళ్లిన కన్నడ నటుడు, దర్శకుడు రిషబ్‌ శెట్టి ఇప్పుడు టాలీవుడ్‌ ఎంట్రీకి సిద్ధమవుతున్నారు. స్వీయ దర్శకత్వంలో తెరకెక్కిన ‘కాంతార: చాప్టర్‌ 1’ చిత్రం దేశవ్యాప్తంగా 800 కోట్లకు పైగా వసూళ్లు సాధించి ఇండియన్‌ సినిమా చరిత్రలో ప్రత్యేక స్థానం దక్కించుకుంది. ఈ అద్భుత విజయంతో రిషబ్‌ శెట్టి దేశవ్యాప్తంగా గుర్తింపు పొందారు. దీంతో ఆయన నటించే తదుపరి సినిమాలపై ప్రేక్షకుల్లో, ఫిల్మ్‌ ఇండస్ట్రీలో భారీ ఆసక్తి నెలకొంది. ఇప్పటికే ‘హనుమాన్‌’ సీక్వెల్‌ ‘జై హనుమాన్‌’లో నటించనున్న ఆయన, ఈ ప్రాజెక్ట్‌ జనవరిలో సెట్స్‌పైకి వెళ్ళనుంది.

Also Read : Jailer 2 : ‘జైలర్ 2’లో మరో స్టార్ కమెడియన్ ఎంట్రీ – డబుల్ డోస్ కన్‌ఫర్మ్!

ఇదిలా ఉండగా, రిషబ్‌ శెట్టి తాజాగా మరో తెలుగు భారీ ప్రాజెక్ట్‌కి గ్రీన్‌సిగ్నల్‌ ఇచ్చారనే వార్త ఫిల్మ్‌నగర్‌లో హాట్‌టాపిక్‌గా మారింది. ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ సితార ఎంటర్‌టైన్‌మెంట్స్ పతాకంపై సూర్యదేవర నాగవంశీ నిర్మించబోతున్నారని సమాచారం. పీరియాడిక్‌ నేపథ్యంతో సాగే ఈ కథకు ‘ఆకాశవాణి’ ఫేమ్‌ దర్శకుడు అశ్విన్‌ గంగరాజు దర్శకత్వం వహించే అవకాశం ఉందట. భారీ బడ్జెట్‌తో తెరకెక్కబోయే ఈ సినిమాపై ఇప్పటికే టాలీవుడ్‌లో చర్చలు మొదలయ్యాయి. అధికారిక ప్రకటన త్వరలోనే వెలువడనుందని, రిషబ్‌ శెట్టి ఈసారికి ఏ రేంజ్‌లో అలరించబోతారనే ఆసక్తి అభిమానుల్లో నెలకొంది.

Exit mobile version