Re Release : స్టార్ హీరోల ఫ్యాన్స్ను హర్ట్ చేస్తోన్న రీ-రిలీజ్ మూవీస్
- Follow Us :
-
-
Add as a preferred
source on google
టాలీవుడ్లో గత కొంతకాలంగా రీ-రిలీజ్ల ట్రెండ్ నడుస్తోంది. తమ అభిమాన హీరోల పుట్టినరోజుల సందర్భంగా వింటేజ్ క్లాసిక్లు, బ్లాక్బస్టర్ సినిమాలను థియేటర్లలో మళ్లీ చూసేందుకు ఫ్యాన్స్ ఎంతో ఆసక్తి చూపుతుంటారు. అయితే ఇటీవల రీ-రిలీజ్ కావలసిన కొన్ని ఐకానిక్ చిత్రాలు చివరి నిమిషంలో వాయిదా పడుతుండటం నందమూరి, అక్కినేని, మెగా అభిమానులను తీవ్ర నిరాశకు గురిచేస్తోంది.
మెగాస్టార్ చిరంజీవి పుట్టినరోజు కానుకగా ఆయన కెరీర్లోని బ్లాక్బస్టర్ మాస్ ఎంటర్టైనర్ ‘ముఠామేస్త్రీ’ చిత్రాన్ని రీ-రిలీజ్ చేసేందుకు సన్నాహాలు చేశారు. మెగా ఫ్యాన్స్ కూడా ఈ సినిమాని మళ్లీ పెద్ద తెరపై చూసి ఎంజాయ్ చేయాలని థియేటర్ల వద్ద హంగామా చేయడానికి సిద్ధమయ్యారు. అయితే డిజిటల్ రీమాస్టరింగ్ పూర్తయిన తర్వాత ఫైనల్ అవుట్పుట్లో కొన్ని సాంకేతిక లోపాలు తలెత్తాయి. క్వాలిటీ విషయంలో కాంప్రమైజ్ కాకూడదనే ఉద్దేశంతో మేకర్స్ ఈ సినిమా రీ-రిలీజ్ను తాత్కాలికంగా వాయిదా వేశారు. త్వరలోనే కొత్త విడుదల తేదీని ప్రకటిస్తామని తెలిపారు.
Also Read
- The Paradise: ‘ది ప్యారడైజ్’ సెన్సార్పై నాని క్లారిటీ.. ‘ఆ ప్రేక్షకులను కచ్చితంగా మిస్ అవుతాం’..
- Sarah Shahi: బెడ్రూమ్ సీన్లలో హీరోల స్పర్శ తగలకుండా ఆ బాల్తోనే.. బోల్డ్ సీన్స్ అసలు గుట్టు విప్పిన హీరోయిన్!
- Tollywood: లాస్ట్ మినిట్ టెన్షన్స్.. చిన్న సినిమాల మేకర్స్ కి ఏమైంది?
- Prithviraj Sukumaran: రాజమౌళితో అంత ఈజీ కాదు, పిండేస్తారు.. పృథ్వీరాజ్ సుకుమారన్ ఆసక్తికర వ్యాఖ్యలు!
కింగ్ నాగార్జున బర్త్డే సందర్భంగా ఆయన కెరీర్లోనే మైలురాయిగా నిలిచిన కల్ట్ లవ్ స్టోరీ ‘గీతాంజలి’ సినిమాను రీ-రిలీజ్ చేయడానికి ప్లాన్ చేశారు. మణిరత్నం దర్శకత్వంలో వచ్చిన ఈ చిత్రం అంటే నేటికీ ప్రేక్షకులలో ఎంతో క్రేజ్ ఉంది. అయితే ఈ సినిమాకి కూడా సాంకేతిక లోపాలే అడ్డంకిగా మారాయి. 4K డిజిటల్ రీమాస్టరింగ్ పనుల్లో అవుట్పుట్లో లోపాలు రావడంతో ఆఖరి నిమిషంలో ‘గీతాంజలి’ రీ-రిలీజ్ను కూడా పోస్ట్పోన్ చేస్తున్నట్లు నిర్వహకులు ప్రకటించారు. ఎంతో ఆశగా ఎదురుచూసిన సినిమాలు సాంకేతిక కారణాల వల్ల రీ-రిలీజ్ కాకపోవడం ఫ్యాన్స్ను తీవ్రంగా అప్సెట్ చేస్తోంది. ముందే అన్ని సాంకేతిక పనులను పూర్తి చేసుకుని ప్రకటనలు ఇస్తే బాగుంటుందని ఇలా చివరి నిమిషంలో హ్యాండ్ ఇవ్వడం సరికాదని అభిమానులు తమ అభిప్రాయాన్ని వ్యక్తం చేస్తున్నారు.
తాజావార్తలు
-
OTR : అనకాపల్లి జిల్లాలో సీఎం రమేష్ వర్సెస్ గుడివాడ అమర్నాథ్
-
Story Board : డీలిమిటేషన్ పై కేంద్రం వ్యూహమేంటి..? తెలుగు రాష్ట్రాల్లో ఏం జరుగుతుంది..?
-
CM Revanth Reddy :హైదరాబాద్లో హార్వర్డ్ కోర్సులు.. డిసెంబర్ నుంచే క్లాసులు
-
Telangana SIR : ఓటర్లకు ఈసీ గుడ్న్యూస్.. నోటీసులకు ఇక ఇలా స్పందించొచ్చు
-
Supreme Court: మహిళకు ఉద్యోగం నిరాకరించినందుకు పనిష్మెంట్.. రూ.12 లక్షలు పరిహారం చెల్లించాలని తీర్పు
ట్రెండింగ్
-
Samsung Phones: పర్సుకి ఫోన్కు తేడా తెలియదు.. అతి చిన్న సైజ్లో శామ్సంగ్ ఫోల్డబుల్ ఫోన్స్..
-
Rishabh Pant-BCCI: విండీస్తో వన్డేలకు రిషభ్ పంత్ దూరం.. అసలు కారణం ఇదే!
-
AMOLED డిస్ప్లే, 50MP ట్రిపుల్ కెమెరా, ఆరేళ్ల సెక్యూరిటీ అప్డేట్స్ తో Samsung Galaxy A18 4G లాంచ్..!
-
200MP కెమెరా, 3D వేపర్ ఛాంబర్, 7100mAh బ్యాటరీతో Nubia NaviX Ultra లాంచ్.!
-
Meta One వచ్చేసింది.. ఇంస్టాగ్రామ్, వాట్సాప్, ఫేస్ బుక్ కు కొత్త సబ్స్క్రిప్షన్ ప్లాన్ ధరలు ఇదిగో.!