NTV Telugu Site icon

రష్మిక గుండుపై రచ్చ.. రచ్చ!

టాలీవుడ్ స్టార్ హీరోయిన్ రష్మిక మందన్నా గుండుతో ఉన్న ఫోటోలు గత రెండు రోజులుగా నెట్టింట వైరల్‌గా మారాయి. ఇది చూసిన నెటిజన్లు రకరకాల కామెంట్స్ చేస్తున్నారు. దీంతో రష్మిక డై హార్ట్ ఫ్యాన్స్‌ ఫైర్ అవుతున్నారు. తమిళనాడులోని కొన్ని సెలూన్‌ బోర్డులపై ప్రస్తుతం గుండుతో ఉన్న రష్మిక ఫోటోలు దర్శనమిస్తున్నాయి. తమ వ్యాపారం కోసం కొంతమంది ఇలా రష్మిక ఫోటోను వాడేశారని తెలిసి ఆమె ఫ్యాన్స్‌ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. సోషల్ మీడియాలో ఎక్కువగా షేర్ చేస్తున్న ఇతర కథానాయికల ఫ్యాన్స్ పేజీలకు వార్నింగ్ ఇస్తున్నారు రష్మిక ఫ్యాన్స్. అంతేకాదు, వారి అభిమానించే హీరోయిన్స్ ఫోటోలను కూడా ఎడిట్ చేస్తూ.. మీమ్స్‌ సృష్టిస్తూ షేర్ చేస్తున్నారు. దీంతో రష్మిక గుండు వివాదం సోషల్ మీడియాలో రచ్చ.. రచ్చగా మారింది.