Bollywood : రాముడి కథకి రూ. 4 వేల కోట్లు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ప్రజల సంస్కృతి, మానవీయ విలువల పునాది అయిన రామాయణం ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు అద్భుత విజువల్స్తో, అత్యంత భారీ బడ్జెట్తో రానుంది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బాలీవుడ్ లోనే కాకుండా, గ్లోబల్ సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించబోతుంది. ఈ పౌరాణిక గాథలో ప్రధాన పాత్రలైన రాముడుగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. వారి లుక్స్పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ నడుస్తోంది. ఈ చిత్రంలో రావణాసురునిగా పాన్ ఇండియా స్టార్ యశ్ నటిస్తున్నట్టు సమాచారం.
Also Read : Infertility Causes in Women : పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..!
Also Read
- Akhil Akkineni : ‘లెనిన్’ కు క్రూషియల్ టెస్ట్.. ఎలాంటి బ్యాటింగ్ చేస్తాడో?
- South Indian Women-Led Films : ప్రపంచవ్యాప్తంగా అత్యధిక వసూళ్లు సాధించిన లేడి ఓరియేంటేడ్ సౌత్ మూవీస్
- Tollywood Sentiments : టాలీవుడ్లో కొత్త సెంటిమెంట్.. పెళ్ళి తర్వాత బ్లాక్బస్టర్ గ్యారెంటీ
- Slum Dog Release : పూరీ జగన్నాథ్ 'స్లమ్డాగ్' సినిమా థియేట్రికల్ రైట్స్ కొనేదెవరు?
అయితే తాజాగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ మూవీ బడ్జెట్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ‘ రామాయణం పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము.. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను’ అని నమిత్ అన్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతుండగా.. ఈ బడ్జెట్ గురించి విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ చిత్రం 20కి పైగా భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. DC, Marvel స్థాయిలో రామాయణం ప్రెజెంటేషన్ ఉండాలని నిర్మాతల లక్ష్యం. బ్యాట్మన్, వండర్ వుమన్ వంటి హాలీవుడ్ ఫ్రాంచైజీలను పోలి ఉండే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్లో అత్యున్నతప్రమాణాలు పాటిస్తున్నారు. కాగా పార్ట్ వన్ – 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుండగా,పార్ట్ 2 – 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన సంస్కృతిని, మన ఇతిహాసాన్ని ప్రపంచానికి చూపించేందుకు తీసుకునే ఈ భారీ ప్రయత్నం, విజయం సాధిస్తే భారత సినిమా పుటల్లో చరిత్రలో నిలిచిపోతుంది.
తాజావార్తలు
-
Fahadh Faasil: ‘పుష్ప 2’ తర్వాత ఫహద్ ఫాసిల్ మరో సర్ప్రైజ్.. ‘డోంట్ ట్రబుల్ ది ట్రబుల్’ టీజర్తో భారీ హైప్
-
Odisha Shocker: విషాద ఘటన.. భార్య మొబైల్తో తలపై కొట్టడంతో భర్త మృతి..
-
APGEF Protest: గుండు చేయించుకుని ఏపీజీఈఎఫ్ వినూత్న నిరసన.. ‘చంద్రన్న బోడిగుండు’ అంటూ ప్లకార్డులు!
-
Shabad Murders: రాజ్కుమార్ బెయిల్ ఆర్డర్లో సంచలన విషయాలు.. పోక్సో కేసులో ముందస్తు బెయిల్.?
-
Puri Jagannath Temple: ప్రతి 12 ఏళ్లకోసారి పూరీ జగన్నాథుడి విగ్రహాన్ని ఎందుకు మారుస్తారు? నవకళేబరంలో దాగిన రహస్యం ఇదే!
ట్రెండింగ్
-
5G, 4G మోడళ్లతో ఎంట్రీ ఇవ్వనున్న Lava Virat V1 సిరీస్.. ఫీచర్స్ ఇవే.!
-
BSNL ధమాకా.. రూ. 259కే 700GB డేటా, అన్లిమిటెడ్ కాల్స్.. ఉచిత OTT కూడా.!
-
iPhone 17 Demand: సీన్ రివర్స్.. ఐఫోన్ 17 సిరీస్కు ఊహించని డిమాండ్.. అసలు కారణం ఏంటో తెలుసా?
-
Mobile Theft: మొబైల్ దొంగతనం యత్నం.. 9 కి.మీ. పాటు రైలుకే వేలాడిన దొంగ.!
-
Rahul Dravid Coach: మరోసారి హెడ్ కోచ్గా రాహుల్ ద్రవిడ్!