Bollywood : రాముడి కథకి రూ. 4 వేల కోట్లు.. నిర్మాత సంచలన వ్యాఖ్యలు!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
భారతీయ ప్రజల సంస్కృతి, మానవీయ విలువల పునాది అయిన రామాయణం ఇప్పుడు అంతర్జాతీయ ప్రేక్షకుల ముందు అద్భుత విజువల్స్తో, అత్యంత భారీ బడ్జెట్తో రానుంది. దర్శకుడు నితేశ్ తివారీ తెరకెక్కిస్తున్న ఈ ప్రాజెక్ట్ ఇప్పటికే బాలీవుడ్ లోనే కాకుండా, గ్లోబల్ సినిమా ఇండస్ట్రీలో కూడా సంచలనం సృష్టించబోతుంది. ఈ పౌరాణిక గాథలో ప్రధాన పాత్రలైన రాముడుగా రణ్బీర్ కపూర్, సీతగా సాయి పల్లవి నటిస్తున్నారు. వారి లుక్స్పై ఇప్పటికే సోషల్ మీడియాలో హైప్ నడుస్తోంది. ఈ చిత్రంలో రావణాసురునిగా పాన్ ఇండియా స్టార్ యశ్ నటిస్తున్నట్టు సమాచారం.
Also Read : Infertility Causes in Women : పిల్లలు పుట్టకపోవడానికి ప్రధాన కారణాలు ఏంటో తెలుసా..!
Also Read
- AK 47: చిట్టిబాబుకు జోడీగా శ్రీనిధి శెట్టి.. స్వర్ణ పాత్రలో ఆకట్టుకుంటున్న గ్లింప్స్
- Rao Bahadur OTT: ఐదు భాషల్లో ఓటీటీలోకి వచ్చేస్తున్న 'రావ్ బహదూర్'.. త్వరలోనే స్ట్రీమింగ్
- Sridevi: వర్షంలో 15 ఏళ్ల శ్రీదేవితో 55 ఏళ్ల హీరో రొమాన్స్ .. అప్పట్లో సంచలనం సృష్టించిన కల్ట్ క్లాసిక్ సాంగ్ ఏంటో తెలుసా ?
- Shah Rukh Khan: బాలీవుడ్ చరిత్రను సొంతం చేసుకున్న బాద్షా.. అరుదైన 'మొఘల్-ఎ-ఆజమ్' పోస్టర్ల కోసం లక్షలు ఖర్చు!
అయితే తాజాగా నిర్మాత నమిత్ మల్హోత్రా ఈ మూవీ బడ్జెట్ గురించి చేసిన వ్యాఖ్యలు సంచలనంగా మారాయి.. ‘ రామాయణం పార్ట్ 1, పార్ట్ 2 రెండు సినిమాలు కలిపి పూర్తయ్యే సమయానికి ఇది దాదాపు $500 మిలియన్లు అవుతుంది, అంటే దాదాపు రూ. 4000 కోట్లు. ప్రపంచం చూడవలసిన గొప్ప కథ రామాయణం. మేము ప్రపంచంలోనే అతిపెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నాము.. తక్కువ ఖర్చుతో పెద్ద చిత్రాన్ని నిర్మిస్తున్నామని నేను భావిస్తున్నాను. ఈ చిత్రం కేవలం డబ్బు కోసమే చేస్తుంది కాదు. ప్రపంచానికి మన రాముడి గురించి చెప్పాలని అనుకున్నాను’ అని నమిత్ అన్నారు. ప్రజంట్ ఈ మాటలు వైరల్ అవుతుండగా.. ఈ బడ్జెట్ గురించి విన్న నెటిజన్లు షాక్ అవుతున్నారు.
ఈ చిత్రం 20కి పైగా భాషల్లో, ప్రపంచవ్యాప్తంగా విడుదల కానుంది. DC, Marvel స్థాయిలో రామాయణం ప్రెజెంటేషన్ ఉండాలని నిర్మాతల లక్ష్యం. బ్యాట్మన్, వండర్ వుమన్ వంటి హాలీవుడ్ ఫ్రాంచైజీలను పోలి ఉండే విధంగా ఈ చిత్రాన్ని తీర్చిదిద్దుతున్నారు. విజువల్ ఎఫెక్ట్స్, గ్రాఫిక్స్లో అత్యున్నతప్రమాణాలు పాటిస్తున్నారు. కాగా పార్ట్ వన్ – 2026 దీపావళి సందర్భంగా విడుదల కానుండగా,పార్ట్ 2 – 2027 దీపావళి సందర్భంగా ప్రేక్షకుల ముందుకు రానుంది. మన సంస్కృతిని, మన ఇతిహాసాన్ని ప్రపంచానికి చూపించేందుకు తీసుకునే ఈ భారీ ప్రయత్నం, విజయం సాధిస్తే భారత సినిమా పుటల్లో చరిత్రలో నిలిచిపోతుంది.
తాజావార్తలు
-
Uday Krishna Reddy: నేను ఎక్కడికీ పారిపోలేదు.. ఆరోపణలు అన్నీ అవాస్తవం.. నా నిర్దోషిత్వాన్ని నిరూపించుకుంటా!
-
Super El Nino: ఊహకందని విపత్తు… మానవాళికి ముప్పు తప్పదా?
-
Japan Earthquake: జపాన్లో భారీ భూకంపం.. రిక్టర్ స్కేలుపై 7.1 తీవ్రత నమోదు, సునామీ హెచ్చరికలు జారీ
-
Vaibhav Sooryavanshi: డాన్ బ్రాడ్మన్తో వైభవ్ సూర్యవంశీకి పోలిక.. మాజీ ప్లేయర్ ఆసక్తికర వ్యాఖ్యలు.!
-
DSC irregularities: దమ్ముంటే చర్చకు రా.. మంత్రి లోకేష్కు మాజీ మంత్రి పేర్ని నాని సవాల్!
ట్రెండింగ్
-
3D కర్వ్డ్ AMOLED డిస్ప్లే, 9,020mAh బ్యాటరీ, 165Hz రిఫ్రెష్ రేట్ తో రాబోతున్న iQOO Z11 5G..!
-
Saransh Jain: భారత జట్టులోకి దేశవాళీ మాన్స్టర్.. ఎవరీ సరాంశ్ జైన్?.. అంత తోపు ప్లేయరా?
-
Sanju Samson: ఎలుకల పందెంలో పరుగెత్తలేను.. ఎలా ఆడాలో ఎవరూ చెప్పక్కర్లేదు.. సంజు సంచలన వ్యాఖ్యలు!
-
8,000mAh బ్యాటరీ, AMOLED డిస్ప్లేతో లాంచ్ కు ముహూర్తం ఫిక్స్ చేసిన POCO M8 Power 5G.!
-
2027 World Cup: ఓపెనర్లుగా రోహిత్ శర్మ, వైభవ్ సూర్యవంశీ.. నాలుగో స్థానంలో శుభ్మన్ గిల్!