Site icon NTV Telugu

Varanasi: జక్కన్న ఆవేదన విలువ 30 కోట్లు?

Rajamouli

Rajamouli

ఇటీవల రాజమౌళి, మహేష్ బాబుతో సినిమా చేస్తున్న విషయాన్ని అధికారికంగా ప్రకటించడమే కాదు, ఒక పెద్ద ఈవెంట్ చేసి టైటిల్ కూడా అనౌన్స్ చేసిన సంగతి తెలిసిందే. వారణాసి పేరుతో రూపొందించబోతున్నట్లు రాజమౌళి ప్రకటించాడు. అయితే, ఈ సినిమా అనౌన్స్‌మెంట్ కోసం చేసిన ఈ ఈవెంట్ రాజమౌళి ప్లాన్ చేసినట్లు దొరక్కపోవడంతో, “ఆంజనేయస్వామి ఉంటే ఇదేనా బాగా చూసుకునేది” అంటూ ఆవేదన వ్యక్తం చేశాడు.

Also Read:iBomma: ఐ బొమ్మలో సినిమాలు చూశారా? తస్మాత్ జాగ్రత్త

ఈ విషయంలో రాజమౌళి మీద చాలామంది విరుచుకుపడుతున్నారు. రాజమౌళి లాంటి స్థాయి దర్శకుడు ఇలా మాట్లాడటం ఏమిటంటూ ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. ఒకచోట రాజమౌళి మీద పోలీస్ కేసు కూడా నమోదు చేయమని ఫిర్యాదు చేశారు. ఇదిలా ఉండగా, ఈ ఈవెంట్ కోసం రాజమౌళి టీమ్ దాదాపు ₹30 కోట్లు ఖర్చుపెట్టినట్లుగా తెలుస్తోంది. వినడానికి షాకింగ్‌గా ఉన్నా, ఇది నిజమే అని తెలుస్తోంది. కేవలం ఎల్ఈడీ స్క్రీన్ కోసమే దాదాపుగా ఎనిమిది నుంచి పది కోట్ల వరకు ఖర్చుపెట్టినట్లుగా సమాచారం.

Also Read:TTD Parakamani Case: పరకామణి కేసులో ఏపీ హైకోర్టు కీలక ఆదేశాలు

అలాగే, సీటింగ్ సహా ఇతర అరేంజ్‌మెంట్స్‌తో పాటు మరిన్ని విషయాలకు గట్టిగానే ఖర్చుపెట్టినట్లు తెలుస్తోంది. చాలామంది ఇంటర్నేషనల్ మీడియా ప్రతినిధులను హైదరాబాద్ పిలిపించి వారిచేత ఇంటర్వ్యూలు కూడా చేయించారు. ఈ నేపథ్యంలో వారికి ప్రయాణ ఖర్చులు, అకామొడేషన్ మొత్తం కలిపి ఈవెంట్ కోసం ఏకంగా ₹30 కోట్లు ఖర్చుపెట్టినట్లు అయింది. ఇంత ఖర్చు పెట్టి కష్టపడి చేస్తే, అనుకున్నది అనుకున్నట్టు జరగలేదు అనే ఆవేదనతో రాజమౌళి అలా మాట్లాడేశారు. ఇప్పుడు కేసులను ఎదుర్కోవాల్సిన పరిస్థితి ఏర్పడింది.

Exit mobile version