NTV Telugu Site icon

People Media Factory: తగ్గేదేలే అంటున్న పీపుల్ మీడియా ఫ్యాక్టరీ

Tg Vishwa Prasad

Tg Vishwa Prasad

People Media Factory Lineup Seems intresting: వేగంగా 100 సినిమాలు చేయాలనే టార్గెట్ తో సినీ రంగంలోకి దిగిన పీపుల్ మీడియా ఫ్యాక్టరీ వరుస సినిమాలతో దూసుకుపోతోంది. ఒక పక్క హై-బడ్జెట్ ఎంటర్‌టైనర్‌లు చేస్తూనే మరోపక్క కంటెంట్-బేస్డ్ చిత్రాలకు పీపుల్ మీడియా ఫ్యాక్టరీ అడ్డాగా మారింది. విజనరీ ప్రొడ్యూసర్ TG విశ్వ ప్రసాద్ తన టేస్ట్‌కు తగ్గట్టుగా అన్ని రకాల జానర్లలో అద్భుతమైన ప్రాజెక్టులను నిర్మిస్తున్నారని చెప్పొచ్చు. ప్రస్తుతం మాస్ మహారాజా రవితేజ, హరీష్ శంకర్ కాంబోలో మిస్టర్ బచ్చన్ ఆగస్ట్ 15న రిలీజ్ కాబోతోంది. ఈ సినిమా టీజర్ తాజాగా విడుదలై సోషల్ మీడియాలో ట్రెండ్ అయింది.

Rashmika Mandanna: ఇండియన్ ఐడల్ 3 స్పెషల్ గెస్టుగా రష్మిక

ఇక పీపుల్ మీడియా ఫ్యాక్టరీ నుంచి మరో సెన్సేషనల్ మూవీ రాజా సాబ్ కూడా రాబోతోంది. దర్శకుడు మారుతి ఇటీవలే ఈ మూవీ గ్లింప్స్‌ను రిలీజ్ చేసి ఒక్కసారిగా అంచనాలు పెంచేశారు. ఇక ఈ గ్లింప్స్‌లో ప్రభాస్ అద్భుతమైన కొత్త లుక్‌లో కనిపించారు. గ్లింప్స్‌కి పాజిటివ్ రియాక్షన్ రావడంతో సినిమాపై అంచనాలు మరింత పెరిగాయి. ఇక ఈ రెండు సినిమాలు మాత్రమే కాదు టీజీ విశ్వ ప్రసాద్ ప్రస్తుతం తన ప్రొడక్షన్ కంపెనీ లైనప్‌ను ఇంట్రెస్టింగ్‌గా ప్లాన్ చేశారు. తేజ సజ్జతో మిరాయ్, అడివి శేష్‌తో G2 వంటి చిత్రాలను నిర్మిస్తున్నారు. ఇక ఇవి కాకుండా అంతేకాకుండా, పీపుల్ మీడియా ఫ్యాక్టరీ ఇటీవలె సన్నీ డియోల్, గోపీచంద్ మలినేనిల డైనమిక్ కాంబినేషన్‌తో కొత్త ప్రాజెక్ట్‌ను ప్రకటించింది. స్టార్ హీరోలు, స్టార్ క్యాస్టింగ్‌తో తగ్గేదేలే అంటూ పీపుల్ మీడియా ఫ్యాక్టరీ సంస్థ దూసుకుపోతోంది