Site icon NTV Telugu

జులై 30న థియేటర్లలో ‘పరిగెత్తు పరిగెత్తు’

Parigetthu Parigetthu Movie to release on July 30

సూర్య శ్రీనివాస్, అమృత ఆచార్య జంటగా నటించిన సినిమా ‘పరిగెత్తు పరిగెత్తు’. ఈ చిత్రాన్ని రామకృష్ణ తోట దర్శకత్వంలో యామిని కృష్ణ నిర్మించారు. ఈ సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ మూవీ ఇటీవలే సెన్సార్ కార్యక్రమాలు పూర్తి చేసుకుంది. దీనికి యు/ఎ సర్టిఫికెట్ జారీ చేసినట్టు నిర్మాత తెలిపారు. ఈ నెల 30న ‘పరిగెత్తు పరిగెత్తు’ సినిమాను గ్రాండ్ గా థియేటర్లలో విడుదల అయ్యేందుకు సిద్ధ చేస్తున్నామని అన్నారు.

Read Also : స్టార్స్ గెటప్ లో నిహారిక గ్యాంగ్ సందడి!

ఈ సందర్భంగా దర్శకుడు రామకృష్ణ తోట మాట్లాడుతూ ”సస్పెన్స్‌ క్రైమ్‌ థ్రిల్లర్‌ నేపథ్యంలో అద్భుతమైన కథ, కథనంతో ఈ చిత్రం రూపొందింది. ప్రేక్షకులకు నచ్చే అన్ని కమర్షియల్‌ అంశాలు ఇందులో ఉన్నాయి. ఇప్పటిదాకా మూవీ నుంచి రిలీజ్ చేసిన ఫస్ట్ లుక్, మోషన్ పోస్టర్, టీజర్, ట్రైలర్, సాంగ్స్ లకు మంచి రెస్పాన్స్ వచ్చింది. థియేటర్ లోనూ ఇదే తరహా స్పందన వస్తుందని నమ్ముతున్నాం” అని అన్నారు.

Exit mobile version