ఇటీవల కశ్మీర్ పహల్గాంలో జరిగిన ఉగ్రదాడి ప్రతి ఒక్కరినీ కలిచివేసింది. ఏకంగా 26 మంది ఈ దాడిలో ప్రాణాలు కోల్పోయారు. బైసరన్ లోయలో జరిగిన ఈ మారణహోమానికి కచ్చితంగా ప్రతీకారం నేర్చుకోవాల్సిందే అంటూ భారతీయులు రగిలిపోతున్నారు. కేంద్ర ప్రభుత్వం కూడా ఈ దాడిని చాలా సీరియస్గా తీసుకుంది. ఇప్పటికే దాడిని ప్రేరేపించిన పాకిస్థాన్పై పలు ఆంక్షలు కూడా విధించింది. పాకిస్థాన్నీ అన్ని రకాలుగా బ్యాన్ చేసి.. ఇండియా నుండి జరుగుతున్న ఎగుమతులు, దిగుమతులు ఆపేయడం తో పాటు, వారికి రావాల్సిన నీటిని కూడా ఆపేసింది. ఛానెల్స్, సోషల్ మీడియా, సినిమాలు ఇలా అన్నింటిని నిలిపివేసింది. అలాగే ఇక పాకిస్థానీ నటుల సోషల్ మీడియాను బ్లాక్ చేయడం , వారి సినిమాలను బాలీవుడ్లో రిలీజ్ అవ్వకుండా ఆపేయడం కూడా జరిగింది. ఈ క్రమంలో తాజాగా ప్రకాష్ రాజ్.. పాక్ హీరో సినిమా రిలీజ్ను అడ్డుకోవడంపై స్పందించారు.
Also Read : Allu Arjun : అల్లు అర్జున్- అట్లీ సినిమాలో మరో హీరో ?
‘పాకిస్తాన్ నటుడు ఫవాద్ ఖాన్ హీరోగా నటించిన ‘అబిర్ గులాల్’ సినిమాను ఇండియాలో బ్యాన్ చేయడం నాకు సరిగ్గా అనిపించడం లేదు. ముందు సినిమా రిలీజ్ చేస్తేనే కదా ఆడియన్స్ పాక్ నటుల సినిమాలు చూస్తారా లేదా అనేది తెలుస్తుంది. రిలీజ్ చేసి ఆ ఫలితాన్ని వారికే వదిలేస్తే మంచిది’ అంటూ తాజాగా ఇచ్చిన ఇంటర్వ్యూలో కామెంట్ చేశాడు ప్రకాశ్ రాజ్. ఆయన పాక్ నటులకి సపోర్ట్ ఇవ్వడాన్ని నెటిజన్స్ తీవ్రంగా ఆగ్రహం వ్యక్తం చేస్తున్నారు. కారణం తెలిసి కూడా వారిని ఎందుకు సపోర్ట్ చేస్తున్నారు.. ఇలాంటి మాటలు మాట్లాడే ముందు ఆలోచించండి అని దారుణంగా తిట్టిపోస్తున్నారు.