Niharika Konidela: మా సినిమాను గుర్తించినందుకు థాంక్స్!
- Follow Us :
-
-
Add as a preferred
source on google
నటి, నిర్మాత నిహారిక కొణిదెలకు సినిమా పట్ల ఉన్న అభిరుచి అందరికీ సుపరిచితం. ఆమె నిర్మించిన ‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం ఆగస్టు 9, 2024న విడుదలై ఘన విజయాన్ని సాధించిన సంగతి తెలిసిందే. థియేటర్లలోనూ, ఓటీటీలోనూ ఈ చిత్రం అద్భుతమైన ఆదరణ పొందింది. తాజాగా, ఈ సినిమా మరోసారి అందరి దృష్టిని ఆకర్షించింది. తెలంగాణ ప్రభుత్వం ఈ రోజు ప్రకటించిన గద్దర్ అవార్డుల్లో ‘కమిటీ కుర్రోళ్ళు’ రెండు ప్రతిష్ఠాత్మక అవార్డులను గెలుచుకుంది.
Also Read:Yamudu: ఆసక్తి రేపుతున్న ‘యముడు’ టీజర్..
Also Read
- Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
- PEDDI : రాయలసీమలో దేవరను దాటలేకపోయిన 'పెద్ది'
- Mega Hero : 100 కథలు రిజెక్ట్ చేసి ఎట్టకేలకు కొత్త సినిమాను లైన్ లో పెట్టిన యంగ్ హీరో
- PEDDI Day -1collections : పెద్ది డే -1 కలెక్షన్స్.. రామ్ చరణ్ కెరీర్ హయ్యెస్ట్
‘కమిటీ కుర్రోళ్ళు’ చిత్రం జాతీయ సమైక్యత, మత సామరస్యం, అణగారిన వర్గాల సామాజిక ఉన్నతిని ప్రోత్సహించే ఉత్తమ ఫీచర్ ఫిల్మ్ అవార్డును సొంతం చేసుకుంది. అంతేకాకుండా, దర్శకుడు యదు వంశీ ఉత్తమ తొలి దర్శకుడిగా అవార్డును అందుకున్నారు. 14 ఏళ్ల తర్వాత తెలంగాణ ప్రభుత్వం రాష్ట్ర అవార్డులను ప్రకటించడం జరిగింది. గద్దర్ పేరిట ఇవ్వబడుతున్న ఈ అవార్డులను ప్రభుత్వం అత్యంత ప్రతిష్ఠాత్మకంగా భావిస్తోంది. రెండు రాష్ట్ర అవార్డులను సాధించినందుకు నిహారిక సంతోషాన్ని వ్యక్తం చేశారు.
Also Read:Sukumar : ఆ మూడు సినిమాలు చేసి ఉంటే సినిమాలు ఆపేసేవాడిని..
ఈ సందర్భంగా నిహారిక మాట్లాడుతూ, “‘కమిటీ కుర్రోళ్ళు’ గద్దర్ తెలంగాణ ఫిల్మ్ అవార్డ్స్ 2024లో రెండు అవార్డులను గెలుచుకోవడం ఎంతో ఆనందంగా ఉంది. మా సినిమాను గుర్తించిన గౌరవనీయ ముఖ్యమంత్రి శ్రీ రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి శ్రీ కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు, జ్యూరీ సభ్యులకు మా హృదయపూర్వక కృతజ్ఞతలు. అలాగే, మిగతా విజేతలందరికీ నా అభినందనలు” అని తెలిపారు.
ఈ విజయంపై యదు వంశీ స్పందిస్తూ, “యువ, నూతన ప్రతిభను ప్రోత్సహించినందుకు తెలంగాణ ప్రభుత్వానికి హృదయపూర్వక ధన్యవాదాలు. ఈ అవార్డులు యువ నటులు, చిత్రనిర్మాతలు, నిర్మాతలు, సాంకేతిక నిపుణుల ఆత్మవిశ్వాసాన్ని మరింత పెంచుతాయి. ఈ గౌరవాన్ని అందించిన ముఖ్యమంత్రి రేవంత్ రెడ్డి గారు, సినిమాటోగ్రఫీ మంత్రి కోమటిరెడ్డి వెంకట్రెడ్డి గారు, జయసుధ గారు, జ్యూరీ సభ్యులకు నా కృతజ్ఞతలు. ఈ గుర్తింపు మాకు స్ఫూర్తినిస్తుంది, ఇంకా అర్థవంతమైన కథలను చెప్పేందుకు ప్రేరణనిస్తుంది. మిగతా విజేతలకు అభినందనలు” అని అన్నారు.
తాజావార్తలు
-
Jhanvi Kapoor : ఇన్స్టాగ్రామ్లో పెద్ది నెగిటివ్ రివ్యూ పోస్ట్ను లైక్ చేసిన జాన్వీ.. ఫీలైనట్టుంది?
-
Rama Nandana: లగ్జరీ లైఫ్స్టైల్ వెనుక “గలీజ్ దందా”.. యూట్యూబర్ రమానందన, మధుకర్కు లుకౌట్ నోటీసులు!
-
OnePlus Community Sale 2026: వన్ప్లస్ కమ్యూనిటీ సేల్ ప్రారంభం.. ఫ్లాగ్షిప్ ఫోన్లు, ట్యాబ్లెట్లపై భారీ డిస్కౌంట్లు
-
KS Bharat Retirement: ఇట్స్ అఫీషియల్.. అంతర్జాతీయ క్రికెట్కు వీడ్కోలు పలికిన తెలుగు క్రికెటర్
-
WhatsApp: మీ వాట్సాప్ చాట్స్ సురక్షితమేనా.? ఈ ఒక్క సెట్టింగ్ ఆన్ చేస్తే సేఫ్.!
ట్రెండింగ్
-
Rajma Chawal: క్విక్ అండ్ హెల్దీ మీల్.. “రాజ్మా రైస్”తో హై ప్రోటీన్ లంచ్.!
-
HONOR Magic V6 లాంచ్.. కేవలం 8.75mm మందం, 6660mAh భారీ బ్యాటరీతో ఫోల్డబుల్ ఫ్లాగ్షిప్.!
-
Healthy Parenting Tips : పిల్లల ఎత్తు పెరగడం లేదా? తల్లిదండ్రులు తప్పక తెలుసుకోవాల్సిన పోషకాహార రహస్యాలు.!
-
Home Remedies : రాత్రిపూట దోమల బెడదా..? దీన్ని ఒక నిమ్మకాయలో పిండి, మీ దిండు దగ్గర ఉంచుకోండి..!
-
Xiaomi 17T భారత్లో లాంచ్.! Leica కెమెరాలు, 6500mAh బ్యాటరీ, 120Hz AMOLED డిస్ప్లేతో ప్రీమియం స్మార్ట్ఫోన్..