నటసింహం నందమూరి బాలకృష్ణ మెగా హీరోకు అనుకోని సర్ప్రైజ్ ఇచ్చారు. ప్రస్తుతం బాలయ్య హీరోగా నటిస్తున్న హ్యాట్రిక్ క్రేజీ ప్రాజెక్ట్ NBK111 షూటింగ్ శరవేగంగా జరుగుతోంది. గోపిచంద్ మలినేని డైరెక్షన్ లో ఈ సినిమా తెరకెక్కుతుంది. అయితే ఈ సినిమా షూటింగ్ లొకేషన్ పక్కనే మెగా సుప్రీం హీరో సాయి దుర్గ తేజ్ నటిస్తున్న సరికొత్త చిత్రం ‘సంబరాల యేటి గట్టు‘ షూటింగ్ కూడా జరుగుతోందని బాలకృష్ణకు తెలిసింది. దాంతో బాలయ్య స్వయంగా తానే ఆ సెట్స్కు వెళ్లి సంబరాల యేటి గట్టు మూవీ టీమ్కు సర్ప్రైజ్ ఇచ్చారు.
సెట్స్లోకి అడుగుపెట్టిన బాలయ్య బాబు.. సాయి దుర్గ తేజ్ను ఎంతో ఆప్యాయంగా పలకరించి ముచ్చటించారు. అనంతరం చిత్ర దర్శకుడు, నిర్మాతలతో కలిసి కాసేపు సమయం గడిపారు. ఈ సినిమా కోసం ఆర్ట్ డైరెక్టర్ అద్భుతంగా డిజైన్ చేసిన భారీ సెట్స్ను బాలకృష్ణ స్వయంగా పరిశీలించారు. సినిమా ప్రొడక్షన్ వాల్యూస్ చాలా గ్రాండ్గా ఉన్నాయని మేకర్స్ రాజీ పడకుండా ఈ చిత్రాన్ని నిర్మిస్తున్నారని ఆయన ప్రశంసించారు. షూటింగ్ స్పాట్లో చిత్ర యూనిట్ చూపిస్తున్న అంకితభావాన్ని, కష్టాన్ని చూసి బాలకృష్ణ ఎంతగానో అభినందించారు. గ్రామీణ నేపథ్యంలో పీరియాడిక్ డ్రామాగా తెరకెక్కుతున్న ఈ చిత్రం ఖచ్చితంగా పెద్ద విజయం సాధిస్తుందని ఆశాభావం వ్యక్తం చేస్తూ టీమ్ మొత్తానికి తన ప్రత్యేక ఆశీస్సులు అందజేశారు. బాలయ్య రాకతో సెట్స్లో సందడి వాతావరణం నెలకొంది. ప్రస్తుతం ఈ న్యూస్ టాలీవుడ్ సర్కిల్స్ తో పాటు సోషల్ మీడియాలో హాట్ టాపిక్ గా మారింది.

