NTV Telugu Site icon

Nizam : మరొక ఇంట్రెస్టింగ్ చిత్రాన్ని పంపిణీ చేయనున్న మైత్రీ మూవీస్

Untitled Design (20)

Untitled Design (20)

ఓంకార్ తమ్ముడిగా జీనియస్ చిత్రంతో ఇండస్ట్రీలో అడుగుపెట్టాడు అశ్విన్ బాబు. తొలి చిత్రం ఆశించిన ఫలితాన్ని ఇవ్వకపోయిన వెనకడుగు వేయక విభిన్న కథలను ఎంచుకుంటూ హీరోగా పలు చిత్రాలలో నటించాడు ఈ  యంగ్ హీరో. ‘రాజు గారి గది’ చిత్రంతో సూపర్ హిట్ కొట్టాడు అశ్విన్. ఈ హీరో నటించిన లేటెస్ట్ చిత్రం “శివం భజే”. ఇటీవల విడుదలైన ఈ చిత్ర ట్రైలర్ ప్రేక్షకుల్లో సినిమాపై అంచనాలు పెంచింది.

ప్రపంచవ్యాప్తంగా ఆగస్టు 1న విడుదలకి సిద్ధంగా ఉన్న గంగా ఎంటర్టైన్మంట్స్ ‘శివం భజే’ చిత్రాన్ని నైజాం ఏరియాలో గ్రాండ్ గా రిలీజ్ చేయనున్నారు ‘మైత్రి మూవీ మేకర్స్’. ఇటీవల విడుదలైన పాటలకి సామాజిక మాధ్యమాల్లో అనూహ్యమైన స్పందన లభిస్తుండడంతో మార్కెట్ లో అంచనాలు భారీగా పెరిగాయి. దాంతో నైజాం ఏరియాలో గ్రాండ్ రిలీజ్ చేసేందుకు మైత్రి మూవీ మేకర్స్ ఎల్. ఎల్. పి లాంటి పెద్ద సంస్థ ముందుకొచ్చింది. ట్రైలర్ లో చూపించినట్టుగా ఇంటర్నేషనల్ క్రైమ్, మర్డర్ మిస్టరీ, సీక్రెట్ ఏజెంట్, శివుడి ఆట లాంటి అనేక అంశాలతో న్యూ ఏజ్ కథనాలతో ఆద్యంతం ఆసక్తికరంగా కథ సాగనుంది. వికాస్ బడిస నేపథ్య సంగీతం, శివేంద్ర విజువల్స్, హీరో అశ్విన్ నటన, గంగా ఎంటర్టైన్మెంట్స్ నిర్మాణ విలువలు, అప్సర్ దర్శకత్వం ఇలా ఎన్నో హైలెట్స్ తో తెరకెక్కిన ఈ న్యూ ఏజ్ డివైన్ సస్పెన్స్ థ్రిల్లర్ చిత్రంలో అశ్విన్ సరసన, దిగంగనా సూర్యవంశీ హీరోయిన్ గా నటించారు.

అర్బాజ్ ఖాన్, దిగంగనా సూర్యవంశీ, హైపర్ ఆది, మురళీ శర్మ, సాయి ధీన, బ్రహ్మాజీ, తులసి, దేవి ప్రసాద్, అయ్యప్ప శర్మ, శకలక శంకర్, కాశీవిశ్వనాధ్, ఇనాయ సుల్తాన తదితరులు ఇందులో ప్రధాన పాత్రలు పోషించారు.

Also Read : Ram Pothineni: మరొక డీల్ క్లోజ్ చేసిన ఇస్మార్ట్ ..ఎన్ని కోట్లో తెలుసా..?