Site icon NTV Telugu

మురళీశర్మకు నట విశిష్ట బిరుదు ప్రదానం

రంగస్థల నాటిక, నాటక కళాకారుల అభ్యున్నతి సాంస్కృతిక సంస్థ కళల కాణాచి. దీని వ్యవస్థాపక అధ్యక్షుడు ప్రముఖ సినీ రచయిత బుర్రా సాయి మాధవ్. ఆయన ఆధ్వర్యంలో తెనాలి లో నిర్వహించిన సాంఘిక నాటక పోటీల ముగింపు సందర్భంగా న్యాయ నిర్ణేత గా ప్రముఖ సినీ నటుడు మురళీ శర్మ పొల్గాన్నారు. ఈ సందర్భంగా కళల కాణాచి, వేద గంగోత్రి సంస్థలు ఆయనను ఘనంగా సత్కరించి ‘నట విశిష్ణ’ బిరుదును ప్రదానం చేసి సన్మానించాయి. తెనాలి వ్యాస్తవ్యులు, ప్రముఖ నిర్మాత, వ్యాపారవేత్త దాసరి కిరణ్ కుమార్ ఈ సభలో మురళి శర్మను గజమాలతో సన్మానించారు. సెలెబ్రెటీ బుక్ ఆఫ్ రికార్డ్స్ డైరెక్టర్లు జి.వి.యన్ వరప్రసాద్, విస్సు సెలబ్రిటీ బుక్ ఆఫ్ రికార్డ్స్ లో స్థానం కల్పిస్తూ రంగస్థల కళాకారుడిగా రంగస్థల నటులను ప్రోత్సహించటానికి శ్రమ తీసుకుని ముంబై నుండి తెనాలి వచ్చిన మురళి శర్మకి ప్రత్యేక కృతజ్ఞతలు తెలిపారు.

Exit mobile version