Site icon NTV Telugu

Mass Jathara : మాస్ జాతర రెడీ.. కానీ రిలీజ్ అవుద్దా?

Mass Jathara

Mass Jathara

రవితేజ, భాను భోగవరపు కాంబినేషన్లో రాబోతున్న ‘మాస్ జాతర’ సినిమా విడుదలపై అనుమానాలు నెలకొన్నాయి. ఈ చిత్రానికి నాగ వంశీ నిర్మాత. ఇప్పటికే షూటింగ్ పూర్తి చేసుకున్న ఈ సినిమాను ఆగస్టు 27న విడుదల చేయాలని చిత్ర బృందం ముందు భావించింది. అయితే, విడుదల తేదీకి ఇంకా పది రోజులే సమయం ఉండగా, ఇప్పటివరకూ పూర్తిస్థాయిలో ప్రమోషన్స్ మొదలుపెట్టకపోవడంపై సినీ వర్గాల్లో చర్చ జరుగుతోంది.

ఈ సినిమా విడుదల కావాలంటే కేవలం ప్రమోషన్ మాత్రమే కాకుండా, ఇటీవల విడుదలైన భారీ చిత్రాలైన ‘కింగ్‌డమ్’, ‘వార్ 2’ వంటి సినిమాల వల్ల ఆర్థికపరమైన ఒత్తిడి కూడా ఎదురయ్యే అవకాశం ఉంది. ఈ ఒత్తిడి కారణంగా ‘మాస్ జాతర’ చిత్రం అనుకున్న తేదీకి విడుదల అవుతుందా లేదా అనే సందేహాలు వ్యక్తమవుతున్నాయి.

ఆలస్యం కారణమేంటి?
సాధారణంగా ఒక సినిమా విడుదల తేదీని ప్రకటించిన తర్వాత, ప్రచార కార్యక్రమాలు ఊపందుకుంటాయి. ట్రైలర్, టీజర్లు, పాటలు విడుదల చేసి ప్రేక్షకుల్లో ఆసక్తిని పెంచుతారు. కానీ ‘మాస్ జాతర’ విషయంలో అలా జరగకపోవడం ఆశ్చర్యం కలిగిస్తోంది. చిత్ర నిర్మాణంలో అంతా సవ్యంగా ఉన్నప్పటికీ, విడుదల తేదీ దగ్గర పడుతున్నా కూడా ప్రమోషన్స్ ప్రారంభం కాకపోవడం వెనుక కారణాలు ఏమై ఉంటాయోనని అభిమానులు ఆందోళన చెందుతున్నారు. భారీ బడ్జెట్‌తో తెరకెక్కిన ‘కింగ్‌డమ్’, భారీగా వెచ్చించి నాగ వంశీ తెలుగు రైట్స్ దక్కించుకున్న ‘వార్ 2’ సినిమాలు ఆశించిన మేర ఫలితాన్ని అందుకోలేక పోయాయి. ఈ ఒత్తిడిని తట్టుకుని ‘మాస్ జాతర’ను నాగ వంశీ నిర్దేశించిన తేదీకి రిలీజ్ చేస్తారా, లేక వాయిదా వేస్తారా అనేది వేచి చూడాలి.

Exit mobile version