NTV Telugu Site icon

Rao Ramesh : రండి బాబు రండి.. సినిమా చూస్తే లక్ష రూపాయలు.. త్వరపడండి

Untitled Design (25)

Untitled Design (25)

రావు రమేష్ కథానాయకుడిగా నటించిన సినిమా ‘మారుతీ నగర్ సుబ్రమణ్యం’. లక్ష్మణ్ కార్య దర్శకత్వం వహించారు. క్రియేటివ్ జీనియస్ సుకుమార్ సతీమణి తబితా సుకుమార్ సమర్పణలో పీబీఆర్ సినిమాస్, లోకమాత్రే సినిమాటిక్స్ సంస్థలపై రూపొందిన చిత్రమిది. బుజ్జి రాయుడు పెంట్యాల, మోహన్ కార్య నిర్మాతలుగా వ్యవహరించారు. రావు రమేష్ సరసన అలనాటి హీరోయిన్ ఇంద్రజ నటించింది.  అంకిత్ కొయ్య, రమ్య పసుపులేటి మరో జంటగా, హర్షవర్ధన్ కీలక పాత్రలో నటించి మెప్పించారు.

Also Read: Devara – దేవర బెనిఫిట్ షోస్ ఎన్నింటికి వేస్తున్నారో తెలుసా..?

తెలంగాణ, ఏపీలో ఈ చిత్రాన్ని అగ్ర నిర్మాణ సంస్థ మైత్రీ మూవీ మేకర్స్‌కు చెందిన మైత్రీ మూవీ డిస్ట్రిబ్యూటర్స్ ఎల్ఎల్‌పి విడుదల చేసింది. ఆగస్టు 23న రిలీజైన ఈ సినిమా మౌత్ టాక్ తో దూసుకెళుతుంది. విడుదలైన మొదటి 3 రోజుల్లో ప్రపంచ వ్యాప్తంగా 2.34 కోట్ల రూపాయల గ్రాస్ రాబట్టింది. తాజాగా ఈ చిత్రాన్ని మరింతగా ఆడియెన్స్ లోకి తీసుకువెళ్లేందుకు బంపర్ ఆఫర్ ప్రకటించారు మేకర్స్. అదేమంటే ” మీరు లక్ష రూపాయలు గెలవాలి అనుకుంటున్నారా.. సుబ్రహ్మణ్యం అకౌంట్ లో లక్ష రూపాయకు పడినట్టే మీ అకౌంట్ లో కూడా పడాలంటే మురుతీ నగర్ సుబ్రహ్మణ్యం సినిమాను థియేటర్లో చూసి మీ టికెట్, మీ పేరు, మీ ఫోన్ నంబరును 8985865727 నంబర్ కు వాట్సప్ చేస్తే 1000 రూపాయల దగ్గరనుండి 1,00,000 మీ సొంతం చేసుకోమని” ప్రకటించారు చిత్ర నిర్మాతలు. లచ్చిమ్ లచ్చిమ్ లచ్చిమ్ దేవి మీ సొంతం అంటూ వినూత్న ప్రచారం చేస్తున్నారు. ఈ ఐడియా ఎంతవరకు గిట్టుబాటు అవుతుందో చూడాలి.